డా.బి.ఆర్ అంభేడ్కర్ కోనసీమజిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో సాధారణ భక్తులకు దర్శనంలో ప్రాధాన్యత ఇవ్వడం కోసం ది.01-05-2025 నుండి (ప్రతి శనివారం మాత్రేమే) స్లాట్ సిస్టం అమలు చేయబడుచున్నది.
- శ్రీ స్వామి వారి దర్శనం నకు వచ్చే VIP సిఫారసు లేఖలపై వచ్చు భక్తులు దర్శనం సమయం ఉదయం 7.00 గంట నుండి 8.00 వరకు (ఒక గంట సమయం మాత్రమే)
- చంటి పిల్లలు, (తల్లి మరియు చంటి పిల్లలు, 2సం.ల లోపు వయస్సు వారు) మరియు దివ్యాంగులు (కాళ్ళు లేకుండా పూర్తిగా నడవలేని వారు మరియు కంటిచూపు పూర్తిగా కనపడనివారికీ మాత్రేమే మరియు దివ్యాంగులతో పాటు ఒక సహాయకుడు మాత్రమే) ఉదయం 11.00 నుండి 12.00 గంటల వరకు (గంట సమయం) – ఈ సేవ పూర్తిగా ఉచితం
- మరలా VIPS దర్శనం సమయం మధ్యాహ్నం 3.00 నుండి సా.4.00 వరకు ( గంట మాత్రమే)
- సాయంత్రం 5.00 గం.ల తరువాత సిఫారసు లేఖలపై ఏవిధమైన దర్శనములు అనుమతించబడవు.
కావున భక్తులు అందరు గమనించి సహకరించ ప్రార్ధన