మే 1 నుంచి 6వ తేదీ వరకు వియత్నాంలో బుద్ధ భగవానుని అవశేషాల ప్రదర్శన

మే 1 నుంచి 6వ తేదీ వరకు వియత్నాంలో జరిగే బుద్ధ భగవానుని అవశేషాల ప్రదర్శనలో భాగంగా నేడు న్యూఢిల్లీలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద పవిత్ర అవశేషాల పేటికకు నమస్కరిస్తున్న కేంద్ర మైనారిటీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

అనంతరం బౌద్ధ మత అనుచరులు ఎంతో పవిత్రంగా భావించే బుద్ధ భగవానుడి అవశేషాలను బౌద్ధమత అనుచరుల సందర్శనార్థం వియత్నాంలోని హెూచిమిన్హ్ నగరంలో జరగబోయే బౌద్ధ ధార్మిక కార్యక్రమం లో ప్రదర్శించనున్న భారత ప్రభుత్వం

ఈ నేపథ్యంలో కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ల నేతృత్వంలో భారత ప్రభుత్వం దేశంలోని వివిధ ప్రాంతాల్లో భద్రపరిచిన బుద్ధుడి పవిత్ర అస్థికలు, అవశేషాలను పటిష్ఠ భద్రత నడుమ న్యూఢిల్లీ నుండి భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్(ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్) చెందిన ప్రత్యేక హెర్క్యులస్ ఎయిర్ క్రాఫ్ట్ లో తీసుకెళ్లేందుకు సిద్ధమైంది.

Scroll to Top
Share via
Copy link