ఐ.యఫ్టి.యు ఆధ్వర్యంలో నిడదవోలు యర్నగూడెం రోడ్ లో మేడే సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభ.
ఈ సందర్భంగా ప్రదర్శించిన ” చేతి కర్ర” నాటకం. పూనం శక్తి లేని వారికి చేయూతగా చేతికర్ర చందాన కార్మిక వర్గానికి కార్మిక సంఘం ఆసరాగా వుండాలన్న చేతికర్ర నాటకం సందేశం.
మేడే జెండావిష్కరించిన ఇఫ్టు నిడదవోలు ఏరియా అధ్యక్షులు తీపర్తి వీర్రాజు మాట్లాడుతూ దశాబ్దాల మేడే చరిత్ర ఘనమైనదనీ, కార్మిక వర్గ హక్కుల కోసం అమరుల త్యాగాల ఫలితమే నేటి కార్మిక వర్గం అనుభవిస్తున్నారని చేశారు.
ఇఫ్టూ జిల్లా కమిటీ సభ్యులు పామర్తి సత్య నారాయణ మాట్లాడుతూ 139 సంవత్సరాల క్రితమే బానిసత్వాన్ని ఎదిరించి కార్మిక వర్గం సాధించిన హక్కు లను మోడీ ప్రభుత్వం కాలరాస్తోందన్నారు.
ఇఫ్టూ జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మ కుమార్ మాట్లాడుతూ కేంద్రం లోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ లకు ఒక ప్రక్క తాను ఊడిగం చేస్తూ మరోవైపు కార్మికులను కట్టుబానిసలుగా మార్చే ప్రణాళిక అమలు పరుస్తోందన్నారు.
అనంతరం పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు.
పై కార్యక్రమంలో శెట్టి పేట భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు ఖండవల్లి వెంకట్రావు, అభ్యుదయ పెయింటర్స్ & ఆర్టిస్ట్స్ యూనియన్ ప్రెసిడెంట్ రవ్వ సురేష్ కుమార్, ప్లాట్ ఫారం రిక్షా వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ కోనేటి మల్లేశ్వర రావు, వెల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు గాలి గని రాజు, పెండ్యాల భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు వున్న మట్ల సురేష్, కోరుపల్లి భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు దుర్గా ప్రసాద్, శింగవరం భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు నూతంగి రమేష్ తదితరులు నాయకత్వం వహించారు.
