ఎస్. సవిత, వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం,చేనేత మరియు జౌళి శాఖ మంత్రివర్యులు.
గాజువాక దుర్గానగర్ లో భగీరథుని విగ్రహా విష్కరణ
భగీరథ మహర్షి మహా జ్ఞాని అని పరోపకారానికి దీక్షకు సహనానికి ప్రతిరూపమని ఎంత కష్టాన్నైనా లెక్కచేయకుండా అనుకున్నది సాధించే వారిని వెనుక బడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌళి శాఖ మంత్రివర్యులు ఎస్. సవిత పేర్కొన్నారు. భగీరథుని వారసులుగా సగరులు ఎంతో పట్టుదల, శ్రమ, నిజాయితీతో ఉంటారని కొనియాడారు. భగీరథుని ఆశయాలను కొనసాగించాలని, ఆయన చూపిన సంకల్ప బలంతో బీసీ వర్గాల్లోని సామాన్యులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఆదివారం ఉదయం 71 వ వార్డు, గాజువాక దుర్గానగర్ లో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి భగీరథ జయంతి కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భగీరథ మహర్షి జయంతి మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన భగీరథ మహర్షి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా మంత్రివర్యులు ఇతర ప్రజాప్రతినిధులు , అధికారులతో కలిసి భగీరథుని విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ భగీరథుని యొక్క ఆశయాలను కొనియాడారు. ఆయన చేసిన కఠోర శ్రమ, చూపిన దీక్ష ఎప్పటికీ మరువలేనిదని ఆమె అన్నారు. భగీరథుని వారసులుగా సగరులు ఎంతో పట్టుదల, శ్రమ, నిజాయితీతో ఉంటారని కొనియాడారు. భగీరథుని ఆశయాలను కొనసాగించాలని, ఆయన చూపిన సంకల్ప బలంతో బీసీ వర్గాల్లోని సామాన్యులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి గారు బీసీలను అన్ని రంగాల్లో ముందు నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో బీసీలు అధికంగా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. బీసీలు అభివృద్ధి చెందడానికి చదువు యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు మరియు ఉప్పర కులాన్ని సగరుగా మార్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం ఆనందంగా ఉందని అన్నారు. చరిత్రను తరతరాలకు అందించే ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారని తెలిపారు. భగీరథుడు మానవాళికి చేసిన కృషిని అందరూ గుర్తుంచుకోవాలని, ఆయన వారసులుగా ఆ కృషిని ఎప్పటికీ మరవకూడదని సూచించారు. ఈ ప్రాంతంలో పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
బీసీ వెల్ఫేర్ సెక్రెటరీ ఎస్ సత్యనారాయణ మాట్లాడుతూ, భగీరథుని వారసులుగా ఒకప్పుడు ముందున్న సగరులు ప్రస్తుతం వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల అక్షరాస్యత యొక్క ఆవశ్యకతను ఆయన నొక్కిచెప్పారు. ప్రభుత్వం బీసీలకు సుమారు 2000 కోట్ల రూపాయల రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటుందని, వెనుకబడిన తరగతుల కోసం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
బీసీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎ .మల్లికార్జున మాట్లాడుతూ, రాష్ట్రంలో బీసీల కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వారి అభివృద్ధికి మరియు ఉత్పాదకత పెంపునకు ‘ఆదరణ 3’ పేరుతో 18 రకాల వృత్తుల వారికి పనిముట్లు అందించే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. అర్హులైన లబ్ధిదారులు బీసీ కార్పొరేషన్ను సంప్రదించాలని సూచించారు.