అదనపు చెల్లింపులు ఏమి లేవా? వాస్తవం ఏమిటి?

ఇసుక ర్యాంపులలో.. లోడింగ్ చేసినందుకు బంటా వారికి తప్ప మిగిలిన చార్జీలు ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారని ఆ ప్రకటన చూసి, తాను పెండ్యాల ఇసుక ర్యాంపులోకి ఈరోజు ఉదయం వెళ్ళానని అన్నారు. లోడింగ్ నిమిత్తం వెళ్లి బంటావారికి 500 చెల్లించి గట్టు మీదకు రాగానే ర్యాంపు కాంట్రాక్టర్లు ట్రాక్టర్ కు 700 చెల్లించాలని అన్నారనీ, తన వద్ద అంత మొత్తం లేదని 500 రూపాయలు ఇవ్వగలనని అనగా వాటినే తీసుకుని తనను పంపించారని ట్రాక్టర్ డ్రైవర్ చెబుతున్నారు. తాను గోపాలపురం ఇసుక ర్యాంపులో బంటావాళ్ళకు 500 చెల్లించానని వారు తనకు రసీదు కూడా ఇచ్చారని తెలిపాడు. పెండ్యాల ర్యాంపులో ఏ విధమైన రసీదులు ఇవ్వడం లేదని అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారని అజ్జరం గ్రామానికి చెందిన ట్రాక్టర్ యజమాని వెంకటేశ్వరరావు తెలుపుతున్నారు.

Scroll to Top
Share via
Copy link