దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్
నాటి ప్రధాని పీవీ నరసింహరావు కేబినెట్లో ఆర్థిక మంత్రిగా పనిచే సిన మన్మోహన్ సింగ్ దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో, జిడిపి వృద్ధి చెందడంలో కీలక పాత్ర పోషించారన్న మంత్రి దుర్గేష్. దాదాపు దశాబ్ద కాలం పాటు దేశ ప్రధానిగా సుదీర్ఘ సేవలు అందించి తనదైన ముద్రవేసిన గొప్ప వ్యక్తి, ఆలోచనపరుడు, నిర్వాహకుడు మన్మోహన్ సింగ్ అని. , దేశ ఆర్థిక వ్యూహాన్ని మారుస్తూ, దేశాన్ని గ్లోబల్ మార్కెట్లోకి చేర్చడంలో, దేశాన్ని ఆర్థిక శక్తిగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన గొప్ప ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ అని పేర్కొన్న మంత్రి దుర్గేష్. సత్పురుషుడు, నిజాయితీపరుడైన మన్మోహన్ సింగ్ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానని తెలిపిన మంత్రి దుర్గేష్.