తణుకు పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ
తణుకు మండలం తేతలిలోని లేహం ఫుడ్ ప్రొడక్ట్స్ పేరుతో ఏర్పాటు చేసిన పశువధ కర్మాగారానికి అనుమతులు తెచ్చింది అప్పటి ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు అని అన్నారు. స్థానికులతో కలిసి ఇప్పుడు రాజకీయ లబ్థి కోసమే కారుమూరి ఆందోళనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. లేహం ఫుడ్స్ కర్మాగారంపై పోరాడే నైతిక హక్కు కారుమూరికి లేదని చెప్పారు. పరిశ్రమ ఇక్కడ రావడానికి కర్త, కర్మ, క్రియ కారుమూరి మాత్రమేనని అన్నారు. 2014 నుంచి 2019 వరకు తాను అధికారంలో ఉన్న సమయంలో పంచాయతీ తీర్మానం చేస్తే పరిశ్రమ నడపకుండా చర్యలు తీసుకున్నామన్నారు. తాము అధికారంలో ఉన్న సమయంలో పరిశ్రమ నడవలేదని చెప్పారు. ఇప్పటికీ పరిశ్రమ నిర్వహణకు తాము వ్యతిరేకమన్నారు. 2023లో సింగిల్ విండో ద్వారా టౌన్ ప్లానింగ్ అనుమతులు తీసుకువచ్చారని గుర్తు చేశారు. 2024 జనవరిలో పొల్యుషన్ బోర్డు ద్వారా అనుమతులు తీసుకువచ్చారని చెప్పారు. లేహం ఫుడ్ ప్రొడక్ట్స్ పరిశ్రమకు అనుబంధంగా హైదరబాదులో తన కుమారుడుతో కలిసి హరి ప్రొటీన్ ఫుడ్స్ పేరుతో పరిశ్రమ ఏర్పాటు చేశారన్నారు. లేహం ఫుడ్స్ ద్వారా వచ్చిన కళేబరాలు సేకరించి వాటి ద్వారా మరో అనుబంధ పరిశ్రమ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరిశ్రమ యాజమాన్యంతో లావాదేవీల్లో తేడాలు వచ్చి ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నారని అన్నారు. 2020 నుంచి 2024 వరకు లేహం ఫుడ్స్ కర్మాగారంలో వచ్చిన రూ. లక్షల్లో బిల్లులు కర్మాగారం నడుపుతున్నారనే దానికి నిదర్శనమన్నారు. కార్మగారం వ్యవహారం జిల్లా కలెక్టర్తోపాటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ పరిశ్రమను నిలిపివేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.