వైసిపి అధికారంలో ఉన్నపుడే విద్యుత్ చార్జీలు పెంచారు – ఆరిమిల్లి

తణుకు పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంచి జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యుత్తు చార్జీలు వ్యతిరేకంగా ధర్నా నిర్వహిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఒక తుగ్లక్ చర్యలు మాదిరిగా అన్నది వాస్తవం. 5 సంవత్సరాల జగన్ ప్రభుత్వంలో పదిసార్లు విద్యుత్ చార్జీలు కరెంటు కోతలతో రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే విద్యుత్ చార్జీలు పెంచడం జరిగిందన్నారు. అదే భారం ఇప్పుడు ప్రజల మీద పడింది అన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సోలార్ పవర్ గాని ఎండి పవర్ గాని ఆరోజు బిపిఎల్ అన్నిటిని కూడా రద్దు చేసుకుని పదివేల మెగావాట్ల విద్యుత్తుని ఈ రాష్ట్రానికి రాకుండా చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. విద్యుత్ చార్జీలు పెంచారని తప్పుడు ప్రచారాలతో వీళ్ళు ధర్నాలు చేయడం సిగ్గుచేటు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link