భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, భారతదేశ ఆర్థిక చరిత్రను కీలక మలుపు తిప్పి, ఎన్నో సంస్కరణలకు ఆధ్యుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, తణుకు పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి నివాళులు అర్పించిన తణుకు ఎమ్మెల్యే చాలా కాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ సంధర్భంగా వారిని స్మరించుకుంటూ తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ పార్టీ కార్యాలయంలోని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ డాక్టర్ మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు భారత ప్రధానిగా ఉన్నారని, 1991లో ఆర్థిక మంత్రిగా ఆయన భారతదేశంలో ఆర్థిక సరళీకరణకు పునాది వేశారని., ఇది ప్రపంచ స్థాయిలో దేశఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిందని అన్నారు. భారతదేశ ఆర్థిక చరిత్రను కీలక మలుపు తిప్పి, ఎన్నో సంస్కరణలకు ఆధ్యుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి బాధాకరమని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
