మండల ప్రజా పరిషత్ కార్యాలయము, అత్తిలి నందు మండల పరిషత్ సర్వసభ్య సమావేశము మండల పరిషత్ అధ్యక్షులు సుంకర నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులు ఆరిమిల్లి రాధాకృష్ణ హాజరయ్యారు. ముందుగా భారత మాజీ ప్రధాని, భారతదేశ ఆర్థిక చరిత్రను కీలక మలుపు తిప్పి, ఎన్నో సంస్కరణలకు ఆధ్యుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి చిత్రపటానికి నివాళులు అర్పించడమైనది. సదరు సమావేశములో శాఖల వారీగా సంబంధిత శాఖల అధికారులు మండలంలో ప్రస్తుతం అమలు జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ పధకాలకు సంబంధించి వివరించడం జరిగింది. సదరు సమావేశములో సభ్యులు అడిగిన సందేహాలకు నివృతం చేయడం జరిగింది.
సదరు సమావేశములో శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ఇప్పటివరకు మీ పదవీకాలంలో గడచిన 3 సంవత్సరాల కాలములో ఎం.పి.టి.సి. సర్పంచులకు ఏ గుర్తింపు లేదు, గ్రామాల అభివృద్ది లేదు. కాని రాబోయే రెండు సం.ము లలో ఈ కూటమి ప్రభుత్వంలో ఎం.పి.టి.సి. లకు మరియు సర్పంచులకు పూర్తి సహకారము ఉంటుందని, గ్రామాల అభివృద్ది చేయుటకు భరోసా ఇచ్చారు. ప్రతి గ్రామములో క్లీన్ & గ్రీన్ గా ఉండేలా దాతల సహకారముతో అభివృద్ధి చేయాలని తెలియజేసారు. అత్తిలి మండలంలోని అన్నీ గ్రామాల అభివృద్ధి కొరకు ఎం.పి.టి.సి.సభ్యులు, గ్రామసర్పంచులు, అధికారులు సహకరించాలని తెలియజేసారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామపంచాయితీల అభివృద్ది చేయుటకి పంచాయితీ సర్పంచులకు పూర్తి అధికారాలు యిస్తామని, 15 th ఫైనాన్స్ నిధులు డైరెక్ట్ గా గ్రామ పంచాయితీలకు జమ చేయడం జరిగిందని తెలియ చేశారు.
సదరు సమావేశమునకు జడ్.పి.టి.సి. సభ్యులు అడ్డాల జానకి, అత్తిలి మండలం నందలి అందరూ ఎంపిటిసి సభ్యులు, సర్పంచులు, ఇంచార్జ్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి పి.శామ్యూల్, తహసీల్దార్, డి. సుబ్రహ్మణ్యేశ్వర వంశీ, మండల స్దాయి అధికారులు, మండలం నందలి అందరూ పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది హాజరయ్యారు.
