మనమంతా పవన్ కళ్యాణ్ నేతృత్వంలో నడిచే శ్రామికులం.. జన సైనికులం

రాజమహేంద్రవరం : త్వరలోనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తామని, కార్యాచరణ రూపకల్పన చేస్తామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇటీవలి కాలంలో వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందిన 21 మంది జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకి రూ.5 లక్షల చొప్పున బీమా చెక్కులను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా శనివారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజా బహుళ్యం లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు మరణించిన క్రియాశీల సభ్యుల కుటుంబాలను ఓదారుస్తూ, వారికి స్వయంగా చెక్కుల అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మంత్రి దుర్గేష్ ధన్యవాదములు తెలిపారు. ఆపత్కాలంలో వారిని ఆదుకునే బాధ్యత తమదని పవన్ కళ్యాణ్ అన్నారని ఈ నేపథ్యంలో క్రియాశీల సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించిన పవన్ కళ్యాణ్ భారత దేశ రాజకీయ చరిత్రలో కొత్త సంప్రదాయానికి నాంది పలికారని మంత్రి దుర్గేష్ అన్నారు. ప్రతి జన సైనికుడు జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు పనిచేయాలని పిలుపునిచ్చారు.. ఈ సందర్భంగా గత ప్రభుత్వం జనసైనికుల పైన పెట్టిన కేసులను మంత్రి ప్రస్తావించారు. విజినరీ లీడర్, దార్శనికత కలిగిన నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పేదల కంట కన్నీరు తుడవడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఉక్కు మనిషిగా కీర్తి గాంచిన ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని మంత్రి తెలిపారు.. రాష్ట్ర అభివృద్ధిని కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, విధిగా తమ బాధ్యతను నిర్వర్తించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని మంత్రి పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం గత ప్రభుత్వం పెట్టిన ధాన్యం బకాయిలను తీర్చిందన్నారు.. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు సరైన మద్దతు ధర కల్పిస్తోందన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొని 24 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తుంది అన్నారు.. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిందన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఇలా అందరికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను సకాలంలో అందజేస్తుందన్నారు. ఓవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధిని సమపాళ్లలో చేపడుతూ ముందుకు వెళ్తుంది అన్నారు. త్వరలోనే ఉచిత బస్సు తల్లికి వందనం కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు. ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజా బహుళ్యం లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్సిపి నేతల దాడిలో గాయపడ్డ ఎంపీడీవోని పరామర్శించేందుకు, తామున్నామని భరోసా కల్పించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ కడప పర్యటనకు వెళ్లారని మంత్రి గుర్తు చేశారు..రాష్ట్రంలో ఆడపిల్లకు కష్టం వస్తే పవన్ కళ్యాణ్ బాసటగా నిలబడుతున్న విషయాలను మంత్రి ప్రస్తావించారు. పార్టీ అధినేత లానే అందరం అదే పంథాను అవలంబిద్దామని మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు. జన సైనికులం అనిపించుకునేలా కార్యక్రమాన్ని చేపట్టి వెన్నముకగా నిలిచిన రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎంతో బిజీగా ఉండి కూడా కార్యక్రమానికి వచ్చి చెక్కులు అందించిన మంత్రి నాదెండ్ల మనోహర్ కు మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి మనోహర్ ను మధురపూడి విమానాశ్రయంలో మంత్రి దుర్గేష్ మర్యాదపూర్వకంగా కలుసుకొని పార్టీ నేతలతో కలిసి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్, స్థానిక రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి, పార్టీ కార్యకర్తలు, బాధ్యత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

Scroll to Top
Share via
Copy link