షెడ్యూల్డ్ కులాలకు చెందిన కులాల సర్వే జాబితా ప్రచురణ నిమిత్తం ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు సర్వే ప్రక్రియ డిసెంబర్ 26 నుంచి చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శనివారం ఒక ప్రకటనలో తెలియచేసారు.
షెడ్యూల్డ్ కులాల కులాల సర్వే జాబితా ప్రచురణ నిమిత్తం నిర్దుష్ట కార్యాచరణ ప్రణాళికను ప్రకటించడం జరిగిందని డిసెంబర్ 31 వరకూ
కులాల సర్వే వివరాల జాబితాను ప్రభుత్వం నిర్ణీత ఫార్మాట్లో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రచురించడం జరుగుతుందని పేర్కొన్నారు. జాబితాలో అందించిన సమాచారానికి సంబంధించి పౌరులు లేదా ఏదైనా మూడవ పక్షం ఫిర్యాదులు లేదా అభ్యంతరాలను లేవనెత్త వచ్చునని కలెక్టరు ప్రశాంతి తెలియ చేశారు. సంబంధిత సెక్రటేరియట్లోని గ్రామ రెవెన్యూ అధికారి (VRO) పౌరులు లేదా ఏదైనా మూడవ పక్షం నుండి ఫిర్యాదులు లేదా అభ్యంతరాలను సేకరించి వాటిని పోర్టల్లో డిజిటలైజ్ చేస్తారన్నారు.
ఫిర్యాదులు లేదా అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత, గ్రామ రెవెన్యూ అధికారి (VRO) లేవనెత్తిన సమస్యలపై క్షేత్రస్థాయి విచారణ నిర్వహిస్తామని తెలిపారు. విచారణ సందర్భంలో కనుగొన్న వాటి ఆధారంగా, గ్రామ రెవెన్యూ అధికారి (VRO) రెవెన్యూ ఇన్స్పెక్టర్కు సిఫార్సులను సిద్ధం చేసి నివేదిక అందజేయాల్సి ఉంటుందన్నారు. ఆమేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ (RI) VRO యొక్క సిఫార్సులను ధృవీకరిస్తారనీ , ఆ ధృవీకరణ పత్రాల ఆధారంగా అన్ని అంశాలు పరిగణించడం జరుగుతుందనీ, అవసరమైన ఆమోదాల కోసం రెవెన్యూ ఇన్స్పెక్టర్ ధృవీకరించిన సిఫార్సులను తహశీల్దార్ (MRO)కి పంపడం జరుగుతుందని పేర్కొన్నారు.
తహశీల్దార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మరియు VRO ఇద్దరి నుండి రిమార్క్లు మరియు సిఫార్సులను సమీక్షిస్తామని కలక్టర్ తెలియ చేశారు. సమీక్షను పూర్తి చేసిన తర్వాత, తహశీల్దార్ తుది నిర్ణయాన్ని పోర్టల్లో అప్లోడ్ చేస్తారు.
కులాల సర్వే నివేదికను ప్రచురించే ప్రక్రియను పూర్తి చేయడానికి క్రింది సమయ కార్యాచరణ ప్రణాళిక నిర్ణయించినట్లు తెలిపారు.
సంబంధిత గ్రామ సచివాలయాలు & వార్డులలో షెడ్యూల్డ్ కులాల కుల సర్వే డేటాను 26.12.2024 న ప్రచురించడం జరిగింది. వీటిపై ప్రజల నుంచి అభ్యంతరాలను 26.12.2024 నుండి 31.12.2024 వరకు అందచెయ్యవచ్చు అని పేర్కొన్నారు. స్వీకరించిన అభ్యంతరాలను ఆన్లైన్ చేయడం మరియు డేటా యొక్క ధృవీకరణ
26.12.2024 నుండి 06.01.2025 వరకు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు.
గ్రామ & వార్డు సచివాలయాల సంబంధిత కులాల కులాల తుది సర్వే డేటా 10.01.2025 న ప్రచురించనున్నట్లు కలక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రజలకు కలెక్టరు విజ్ఞప్తి చేశారు.