👉 జిల్లాలో 64,441 గ్రాడ్యుయేట్ ఓటర్లు
👉 ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ
👉 యువ ఓటర్ల నమోదులో రాజకీయ పార్టీల పాత్ర కీలకం – జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి
👉ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు ఎస్ ఎస్ ఆర్ 2025 అనుసరించి ఓటర్ల తుది జాబితాను ప్రచురించడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు.
👉సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, అదనపు ఎస్పీ మురళీ కృష్ణ, రాజకీయ పార్టీల ప్రతినిధులు సిపిఐ -; కే. రామకృష్ణా , పి. రామకృష్ణా, బీజేపీ – ఎన్ శివ కుమార్, ఎమ్ ఎన్ బాబు సమక్షంలో జిల్లా కలెక్టర్ ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు 2024 అక్టోబరు 29 ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ పబ్లికేషన్ చెయడం జరిగిందని పేర్కొన్నారు. నవంబర్ 23 న సమీకృత ఓటరు జాబితా ప్రకటించినట్లు తెలిపారు. డిసెంబరు 24 న క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పూర్తి స్థాయిలో పరిష్కారం చేసినట్లు తెలిపారు. 2025 జనవరి ఒకటవ తేదీన తుది ఓటరు జాబితా సిద్ధం చేశామన్నారు.
👉2025 జనవరి 6 వ తేదీన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తుది జాబితాను విడుదల చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. పలు దశల్లో హేతుబద్ధత కలిగిన ఓటరు జాబితా రూపకల్పన విషయంలో రాజకీయ పార్టీల సూచనలు ఎంతో ఉపయోగపడడం జరిగిందన్నారు. యువ ఓటర్ల నమోదులో మరింతగా తోడ్పాటు అందించాలని కోరారు. 2024 ఎస్ ఎస్ ఆర్ లో 1581 పొలింగ్ కేంద్రాలలో పురుషులు 791393 మంది, స్త్రీలు 829650 , థర్డ్ జెండర్ 94 లు వెరసి 16,21,137 మంది ఓటర్లు ఉండగా, ఎస్ ఎస్ ఆర్ 2025 తదుపరి ఓటర్లు పురుషులు 7,91,043 మంది, స్త్రీలు 8,29,750, థర్డ్ జెండర్ 95 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో 684 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఓటరు జాబితా రూపకల్పన కొత్తగా 1396 మంది పురుషులు, 1794 మంది స్త్రీలు ఓటర్లుగా నమోదు కాగా, మరణాలు, చిరునామాలు మార్పు తదితర కారణాల వల్ల 1745 మంది పురుషుల, 1694 మంది మహిళా ఓటర్లు ఓటరు జాబితా నుంచి తొలగించినట్లు కలెక్టరు ప్రశాంతి వివరించారు. 👉గ్రాడ్యుయేట్ ఓటర్లు కు చెంది తూర్పు గోదావరి జిల్లాలో 82 పొలింగ్ కేంద్రాల పరిథిలో 63,441 మంది ఓటర్లు ఉన్నారనీ కలెక్టరు ప్రశాంతి తెలియ చేశారు. 2024 నవంబర్ 23 న ప్రకటించిన డ్రాఫ్ట్ పబ్లికేషన్ నాటికి పురుషులు 30292 , స్త్రీలు 21318 , థర్డ్ జెండర్ 14 మంది ఓటర్లు ఉండగా, తుది జాబితా పబ్లికేషన్ నాటికి పురుషులు 36,714 , స్త్రీలు 26,725 , థర్డ్ జెండర్ రెండు ఓట్లు ఉన్నట్లు తెలిపారు. మొత్తంగా 6,422 మంది పురుష ఓటర్లు, 5407 మంది స్ర్తీ ఓటర్లు గ్రాడ్యుయేట్ ఓటర్లు గా నమోదు చేసుకున్నట్లు తెలిపారు.
👉ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, అదనపు ఎస్పీ మురళీ కృష్ణ, రాజకీయ పార్టీల ప్రతినిధులు సిపిఐ -; కే. రామకృష్ణా , పి. రామకృష్ణా, బీజేపీ – ఎన్ శివ కుమార్, ఎమ్ ఎన్ బాబు, ఎలక్షన్ సూపరింటెండెంట్ దేవి, డిప్యూటి తహసిల్దార్ శాస్త్రి, సీనియర్ అసిస్టెంట్ అప్పారావు లు పాల్గొన్నారు.