యువత ఆదర్శంగా ఉండాలి..!
* యువత బాధ్యతగా, చైతన్యంగా ఉండాలని పిలుపు..
* ఫ్లెక్సీ వివాదం కారణంగా మరణించిన నలుగురు యువకులు..
* తూర్పు గోదావరి జిల్లాలో బీసీవై అధినేత పర్యటన
రాజకీయాలు, రాజకీయ వివాదాలు, కుల సంబంధిత అంశాలు పట్ల యువత బాధ్యతగా, చైతన్యంగా ఉండాలని భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు.. సోమవారం ఆయన తూర్పుగోదావరి జిల్లాలో ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో పర్యటించారు.. ఈ గ్రామంలో రెండు నెలల కిందట సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా విద్యుతాఘాతంతో నలుగురు యువకులు మరణించారు.. ఈ విషయం అప్పుడే తెలుసుకున్న రామచంద్ర యాదవ్ “42 రోజుల సంకల్ప దీక్ష”లో ఉండడంతో నేరుగా రాలేకపోయారు.. కానీ బాధిత కుటుంబాలతో, గ్రామా పెద్దలతో ఫోన్ లో మాట్లాడి, ఓదార్చారు, కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.. ఈ నేపథ్యంలో ఈరోజు నేరుగా వారి ఇళ్లకు వెళ్లి కుటుంబ పరిస్థితులను తెలుసుకుని ఒక్కో కుటుంబానికి రూ. 50 వేలు చొప్పున ఆర్ధిక సాయం అందించారు..ఈ సందర్భంగా తనను కలిసిన నాయకులు, యువతతో ఆయన మాట్లాడుతూ.. మన దేశంలో యువజనాభా ఎక్కువగా ఉన్నారని.., వారిని, వారిలో మేథస్సుని సక్రమంగా వాడుకుంటే అద్భుతాలు సాధించవచ్చాన్నారు.. మన రాష్ట్రంలో కూడా 40 శాతం వరకు యువతే ఉన్నప్పటికీ, ఇక్కడ అవకాశాలు లేక దాదాపు పది లక్షల మంది చదువుకున్న, మేథస్సు ఉన్న యువత వేరే రాష్ట్రాల్లో ఉద్యోగం, ఉపాధి పొందుతున్నారని అన్నారు.. వారి తెలివి, మేథస్సు, యువసంపదను రాష్ట్రంలో వాడుకుంటే దేశంలో మనమే అగ్రస్థానంలో ఉంటామని.. ఆ దిశగా బీసీ యువజన పార్టీ కచ్చితమైన ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. రాజకీయ, కులపరమైన, ఇతర వివాదాస్పద అంశాల్లో యువత అప్రమత్తంగా ఉండాలని, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని అత్యంత చైతన్యంగా అడుగులు వేయాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.