తణుకు పట్టణంలో ఎమ్మెల్యే కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
ఈ సందర్భంగా అరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ.
తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలో ఉన్న లాహం ఫుడ్ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై ఏదైతే చర్చ జరుగుతుందో దానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు అర్ధ రూపాయికి రూపాయిన్నర యాక్షన్ చేస్తున్నారని అన్నారు. నా పరిపాలనలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు అడ్డంగా పడుకున్నాను వైజాగ్ వెళ్లి పొల్యూషన్ బోర్డుకి వెళ్లి ఆపించానని నేను ఉన్నప్పుడు ఎటువంటి పర్మిషన్లు రాలేదని చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా అబద్ధాలు చెబుతూ నటన చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. కారుమూరి నాగేశ్వరరావు నువ్వు మేము ప్రలోభాలకు లొంగి పోతున్నావు అని అంటున్నావ్ నీ రాజకీయ ఎదుగుదల నువ్వు ఎన్ని ప్రలోభాలు పెట్టి ఈ యొక్క రాజకీయానికి వచ్చావని మీ చరిత్ర అంతా తెలుసని ఎక్కడినుంచో వచ్చి ఎక్కడ ఉంటున్నావని మమ్మల్ని విమర్శించే హక్కు నీకు లేదని అన్నారు. నీవు అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిపోయావని ప్రజల్ని చులకనగా మాట్లాడడం రైతులను ఎర్రి పప్ప అనే సంబోధించడం వలన నీకు నియోజకవర్గ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పిన గాని నీకు సిగ్గు లేదని అన్నారు. నేను 2014 నుంచి 2019 వరకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో సహా ఇవ్వగలనని అన్నారు.
మీ హయాంలో ఫ్యాక్టరీ మూసి వేయడానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఆ ఫ్యాక్టరీ ని ఆపినట్లు ఎవిడెన్స్ ఉంటే నేను నీకు క్షమాపణ చెప్పగలనని అన్నారు.
నేను ఈ ఫ్యాక్టరీకి ఎగైనెస్ట్ గా ఏ విధంగా ప్రయత్నం చేసినాను అవన్నీ కూడా డాక్యుమెంట్ ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నదని అన్నారు.
మీరు చేసిన తప్పులు మీరు చేసిన దరిద్రం మా మీద రుద్దుతున్నారని అన్నారు.
ఈ ఫ్యాక్టరీ కి 2013 సంవత్సరంలో ఆద్యం పోసింది కారుమూరి నాగేశ్వరావు అని ఈయన కనుసన్ననలో ఈయన పార్టీకి చెందిన వ్యక్తులు డైరెక్టర్లుగా ఈ కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగిందని అన్నారు.
ఫిబ్రవరి 2014లో ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు తరువాత నేను శాసనసభ్యులుగా ఎన్నికైనప్పుడు ఆ ఫ్యాక్టరీ లో వెజిటబుల్,,మీట్ ప్రాసెసింగ్ అని చెప్పి అప్లై చేయడం జరిగిందని అన్నారు.
తరువాత 2016 సంవత్సరంలో పంచాయతీ తీర్మానం మా దృష్టిలో లేనందున సదరు పంచాయతీ తీర్మాన్ని క్యాన్సిల్ చేయించడం జరిగిందని అన్నారు.
డిసెంబర్ 2015 సంవత్సరంలో దీనికి సంబంధించి నేను అప్పట్లో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి జిల్లా పరిషత్ మీటింగ్ లో కూడా మాట్లాడడం జరిగిందని అన్నారు. 20-3-2016 సంవత్సరంలో జిల్లా పరిషత్ మీటింగ్ లో జిల్లా కలెక్టర్ ఆపు చేయమని చెప్పడం జరిగిందని, దానిని రికమెండ్ చేయడం జరిగిందని అలాగే పొల్యూషన్ డిపార్ట్మెంట్ కూడా రికమెండ్ చేయడం జరిగిందని అన్నారు.
2016 సంవత్సరంలో ఏదైతే పంచాయితీ వారు ఇచ్చింది కూడా రీవోక్ చేయడం జరిగిందని,23-7-16 లో లాభం ఫుడ్స్ వారికి పొల్యూషన్ బోర్డ్ వారు షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగిందని అన్నారు.
19-8-2016 సంవత్సరంలో దీనికి సంబంధించి ఆర్డర్స్,కనెస్ట్రక్షన్స్ గాని ఏమీ చేయకూడదని ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందని అన్నారు.
ఈ విధంగా ఆ ఫ్యాక్టరీ ఆపు చేయడానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఫ్యాక్టరీని ఆపించడం జరిగిందన్నారు.
ఫ్యాక్టరీ ఆపడానికి అన్ని పర్మిషన్లు మేమే తెచ్చాము అని అంటున్నారు కానీ ఒక పర్మిషన్ కూడా తేలేదని అన్నారు.
కారుమూరి నాగేశ్వరరావు శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత డిసెంబర్ 2019 లో ల్యాండ్ కన్వర్షన్ కి అప్లై చేయడం జరిగింది అని ల్యాండ్ కన్వర్షన్ అయిందని అన్నారు.
ఈ లాహం ఫ్యాక్టరీ కి ల్యాండ్ కన్వర్షన్ సంబంధించి గాని బిల్డింగ్ పర్మిషన్ కి సంబంధించి గాని ఏ విధంగా వచ్చిందో ఈ పెద్దమనిషి సమాధానం చెప్పాలని అన్నారు.
2021 సంవత్సరంలో కన్సన్ట్ ఫర్ ఆపరేషన్ కు అప్లై చేయడం జరిగిందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇవ్వడం జరిగిందని అన్నారు.
2022 సెప్టెంబర్ నెలలో NOC కూడా ఇవ్వడం జరిగిందని,
2022 అక్టోబర్ నెలలో ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఇచ్చిందని అన్నారు.
ఈ విధంగా కారుమూరి నాగేశ్వరరావు 2019 నుంచి 2024 వరకు ఫ్యాక్టరీ రన్ అవ్వడానికి ల్యాండ్ కన్వర్షన్ అవ్వడానికి బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ తీసుకోవడానికి అన్ని పర్మిషన్లు ఆయన హయాంలో వచ్చాయని అన్నారు.
ఇవన్నీ జరిగిని ఆయన హయం లోనని మరి ఇన్ని అబద్ధాలు ఆడుతున్నాడని అన్నారు.
2021 లో పొల్యూషన్ పర్మిషన్ రావడం జరిగిందని ఫైనల్ పర్మిషన్
17-01-24 సంవత్సరంలో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జోనల్ ఆఫీస్ నుంచి రావడం జరిగిందని అన్నారు.
ఈ లాహం ఫ్యాక్టరీ దరిద్రాన్ని తీసుకొచ్చి తణుకులో పెట్టడం పూర్తి బాధ్యత కారుమూరి నాగేశ్వరరావుదేనని అన్నారు.
ఈ ఫ్యాక్టరీ పనిచేయడానికి కారణం కర్త కర్మ క్రియ అన్ని కారుమురి నాగేశ్వరరావు అని అన్నారు.
లాహం ఫ్యాక్టరీకి సంబంధించిన జనరల్ మేనేజర్ పర్మిషన్ అన్నీ ఎప్పుడు వచ్చినవో ఆయనే స్వయంగా కారుమూరి హయాంలో వచ్చినయని చెప్పడం జరిగిందని అన్నారు.
కానీ కారుమూరి నా హయాంలో వచ్చినయి అని అబద్ధాలు చెబుతున్నాడని అన్నారు.
కారుమూరి నాగేశ్వరరావు అతను కొడుకు హైదరాబాదులో హరి ప్రోటీన్ ఫుడ్స్ అని దానికి సంబంధించి లాహం ఫ్యాక్టరీ నుంచి మెటీరియల్ సప్లై చేస్తారని, మరి లాహం ఫుడ్ ఫ్యాక్టరీ నుంచి మెటీరియల్ అంతా హైదరాబాదులో ఉన్న అతను కొడుకు ఫ్యాక్టరీకి పంపుతారని సదరు విషయం లాహం ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ చెప్పారని అన్నారు.
హైదరాబాదులో స్థాపించినటువంటి ప్రోటీన్ ఫుడ్స్ ఏదైతే ఉందో ఈ జంతు మాంసం ఫ్యాక్టరీ నుంచి మిషనరీ ఎవరు సప్లై చేసినారు వారికి మీకు ఉన్న సంబంధం ఏమిటి అని అన్నారు.
లాహం ఫుడ్స్ వారితో మిషనరీ తీసుకొని హైదరాబాదులో హరి ప్రోటీన్ ఫుడ్స్ స్థాపించడం నిజమా కాదా అని అన్నారు అది ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు.
ఆరోజు లాభం ఫ్యాక్టరీ తో లాలోచబడి పర్మిషన్స్ అన్ని ఇప్పించి ఈరోజు పెద్దమనిషిలా వ్యవహరిస్తున్నావు అని అన్నారు.
మేము ఈ ఫ్యాక్టరీ పై అన్ని విధాలుగా కూడా అందరి అధికారుల చికి తీసుకొని వెళ్లడం జరిగింది అలాగే కలెక్టర్ తో కూడా చెప్పడం జరిగిందని అక్కడున్న ప్రజలు ఇబ్బందులు గురించి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్లిందని అన్నారు.
డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో ఫ్యాక్టరీ పై అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి అన్ని రకాలుగా పూర్తిగా ప్రయత్నిస్తున్నామని అన్నారు.
ఉత్తర ప్రదేశ్ వాస్తవ్యులతో నువ్వు వ్యాపారాలు పెట్టుకొని ప్రజల తరపున మాట్లాడుతున్నావని, కానీ మాకు నియోజకవర్గ ప్రజలు ముఖ్యమని ఈరోజు మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారని ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వారికి సేవ చేయడానికి నేను,ఈ ప్రభుత్వం ఉందని అన్నారు.
ఈ ఫ్యాక్టరీ పై స్పందించి చర్యలు తీసుకునే విధంగా మేము చేస్తామని నీవు ఈ ప్రజల గురించి ఫ్యాక్టరీ గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు.