ఉండ్రాజవరం మండలం, మోర్త ఉన్నత పాఠశాలలో గురువారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కె. శ్రీనివాస్ సారధ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా జరుపుకున్నారు. బాలికలు రంగవల్లికలు వేస్తే, మగపిల్లలు భోగిమంటలను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సమక్షంలో వేశారు. రంగవల్లికల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన విద్యార్థినులకు బహుమతులిచ్చారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ మాట్లాడుతూ సంక్రాంతి తెలుగువారి పండగ అని, రైతుల పండుగ అని అందరూ ఆనందోత్సాహాలతో ఉండాలని అంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు.
