భారతీయ సంస్కృతి సంప్రదాయాలను రాబొయే తరాలకు చేరవేయాలనే లక్ష్యంతో రాష్త్ర బి.సి.మహిళా నాయకురాలు, వీవర్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాల కార్యక్రమాలు ఎంతో వేడుకగా జరిగాయి. తొలుతగా బాణాసంచా, గంగిరెద్దుల విన్యాసాలు, బోగి మంటలు, విచిత్ర వేషధారణలు, గాలి పటాలు, గోబ్సిపాటలు, మెహందీ, సాంప్రదాయ, వస్త్రధారణ,వంటలు,ముగ్గుల పోటీలు మొదలగు కార్యక్రమాలతో ఎంతో వైభవంగా జరిగినవి ఈ సందర్భంగా
కాలేజీగ్రౌండ్ లో సంక్రాంతి సంబరాలలో మనం ఆచరించే ప్రతికార్యక్రమాన్ని సాంప్రదాయ వస్త్రధారణ, వంటలు, ముగ్గుల పోటీలు, గాలి పటాలు, మెహాందీ చిన్నారులచే విచిత్ర వేషధారణ వంటి అనేకపోటీలు విద్యార్థులచే నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా లయన్ గవర్నర్ కాకరాల వేణుబాబు, తణుకు టౌన్ సి.ఐ., సి.హెచ్
కొండలరావు, తణుకు మున్సపల్ కమీషనర్ టి.రామ్ కుమార్, తాతినేని రామబ్రహ్మం, చిలుకూరి రామకృష్ణ, లయన్స్ క్లబ్ మెంబర్స్ ఎన్ వి వి ఎస్ పాపారావు నాయుడు, డాక్టర్ సుబ్బారావు, మేకా శ్రీరామ్ సురేష్, కిశోర్ కుమార్, దామెర రంగారావు, మాదిరెడ్డి బాబుజీ, శ్రీహరి, చీకటి శ్రీనివాస్, పి.వి.రవణ, చిట్టూరి సుజాత, కె.యన్ పద్మావతి, దామెర సురేఖ, టి.ఎస్ పద్మావతి, తులసి తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఇంపల్స్ కాలేజి ప్రిన్సిపల్ కె.ఎన్. వి.రామ్ కుమార్ ఈ కార్యక్రమంలో విద్యార్థులచే చక్కని కార్యక్రమాలు నిర్వహించి సహకారం అందించారు.
ఈ సందర్భంగా సరళాదేవి మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు 18 సంవత్సరాల నుండి చేస్తున్నామని సంస్కృతి సాంప్రదాయాలు నేటియువతరానికి అందించాలని ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం పోటీలుగా నిర్వహించి బహుమతులు ప్రదానం చేయటం ద్వారా వారికి మనం సాంప్రదాయాన్ని తెలిపి భవిష్యత్ తరాలకు చేరవేసిన వారమవుతామని, సంస్కృతి అంటే సైన్స్ అని, సైన్స్ అంటే ఆరోగ్యం అని నేటితరానికి అందచేయటం పెద్దలుగా మన కర్తవ్యం అని అన్నారు.
ఈ సందర్భంగా సరళాదేవి ఇంపల్స్ కాలేజీ ప్రిన్సిపాల్ రామ్ కుమార్ దంపతులకు సన్మానం చేసి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులైన సిఐ, కమీషనర్, ఇంపల్స్ కాలేజి యాజమాన్యం సరళాదేవి దంపతులకు అభినందనలు తెలియజేశారు.
