జిల్లాలో 680 మినీ గోకులం నిర్మాణానికి గాను ఇప్పటి వరకు 304 షేడ్స్ నిర్మాణం పూర్తి చేశాం.
** రైతు పక్షపాతిగా రైతులకు మంచి చేయాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుంది.
** గ్రామంలో 1.85 లక్షలతో నిర్మించిన గోకులాన్ని ప్రారంభించి, అనంతరం సంక్రాంతి సంబరాల వేడుకల్లో
రైతు పక్షపాతిగా రైతులకు మంచి చేయాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం నిబద్ధతతో వారి మేలుకోరి పనిచేస్తోందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం నిడదవోలు మండలం విజ్జేశ్వరం గ్రామంలో రు. 1.85 లక్షలతో నిర్మించిన మినీ గోకులాన్ని మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి సాంప్రదాయ పద్ధతిలో గోమాతకు పూజలు నిర్వహించి, పొలంలో వరి నాట్లను స్వయంగా నాటి, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలను నాటారు. అనంతరం ఎడ్ల బండి పై గ్రామంలోకి విచ్చేసి సంక్రాంతి వేడుకల్లో భాగస్వామ్యం అయ్యారు. మహిళలు చిన్నారులు వేసిన ముగ్గులను, సాంప్రదాయ పద్ధతిలో హరినామం చేస్తున్న హరిదాసు సంకీర్తన ను ఆసక్తిగా తిలకించి, భోగి మంటలను వెలిగించి ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.