తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుపట్నం నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయనకు పార్లమెంటులో జరిగిన అవమానం గురించి పట్టణ కాంగ్రెస్ తరపున అమిత్ షా ని తక్షణమే పదవికి రాజీనామా చేసి బహిరంగంగా దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని దేవాలయం లాంటి పార్లమెంట్లో హేళనగా మాట్లాడుతూ అవమానపరిచినారు. ఈరోజు దేశంలో ప్రతి ఒక్కరు మనోభావాలు దెబ్బతిన్నాయి ఇప్పటికైనా ప్రధానమంత్రి మోడీ కళ్ళుతెరిచి వాళ్ల మంత్రులు గాని కార్యకర్తలు గాని ఎవరైనా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని హేళనగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇంకా ఉధృతంగా జనంలోకి తీసుకెళ్తామని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున వాగ్దానం చేస్తున్నామని నిడదవోలు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మేడవరపు భద్రందొర అన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
