వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో సోషల్ మీడియా విభాగం ఆత్మీయ సమావేశం భీమవరం పట్టణంలో గల వైసిపి జిల్లా కేంద్ర కార్యాలయం నందు పశ్చిమగోదావరి జిల్లా వైఎస్ఆర్ సోషల్ మీడియాసమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిలుగా జిల్లా పార్టీ అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, పార్లమెంట్ కో ఆర్డినేటర్ ఉమాబాల, పాలకొల్లు ఇన్చార్జి గుడాల గోపి, ఎం.ఎల్.సి. కవురు శ్రీనివాస్, సోషల్ మీడియా స్టేట్ అధ్యక్షులు దొడ్డ అంజిరెడ్డి, జిల్లాఅధికార ప్రతినిధులు సోషల్ మీడియా కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరు అయ్యారు. ఇందు ముఖ్య ఉద్దేశం సోషల్ మీడియా కార్యకర్తలకు మేము అండగా ఉన్నామని భరోసా కల్పిస్తు జిల్లాఅధ్యక్షులు ముదునూరి ప్రసాద రాజు, మాజీ మంత్రి కారుమురి నాగేశ్వరరావు, సోషల్ మీడియా కార్యకర్తలకు ధైర్యం నింపారు.
