తిరుపతి మృతుల కుటుంబాలకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఏపీ సెక్రటరియేట్లో కలసి కృతజ్ఞతలు తెలిపిన నవతరంపార్టీ జాతీయ అధ్యక్షులు రావుసుబ్రహ్మణ్యం.
తిరుపతి మృతుల కుటుంబాలకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఏపీ సెక్రటరియేట్ లో శుక్రవారం 10-01-2025 సాయంత్రం 6 గంటలకు నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం మర్యాదపూర్వకంగా కలిశారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయంతో పాటు ఉద్యోగాలు ఇచ్చేందుకు తీసుకున్న నిర్ణయం అభినందనీయం అన్నారు.సత్వరమే స్పందించి ప్రభుత్వం సాయం చేయడం వల్ల ప్రభుత్వం చేసిన పని ప్రజల గుండెల్లో నిలిచిపోతుందన్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి రావు సుబ్రహ్మణ్యం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తేవాలని పరిష్కారం చూపేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యంకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.