ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా అత్తిలి మండలం మంచిలి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు వహించిన వేడుకల్లో పాల్గొన్న తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి
తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకుడు సిరగాని నాగేశ్వరరావు ఆర్థిక సాయంతో పలువురికి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా అత్తిలి మండలం మంచిలి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు వహించిన వేడుకల్లో పాల్గొన్న తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకుడు సిరగాని నాగేశ్వరరావు ఆర్థిక సాయంతో పలువురికి ఎమ్మెల్యే అరిమిల్లి అరిమిల్లి రాధాకృష్ణ చేతులమీదగా చెక్కులను అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవతా సంస్థకు లక్ష రూపాయలు, అయ్యప్ప స్వామి గుడి అభివృద్ధికి రెండు లక్షలు, పెద్దింట్లమ్మ తల్లి గుడి అభివృద్ధికి రెండు లక్షలు మరియు 35 మందికి నెలకు సరిపడా నిత్యవసర వస్తువులు, 2500 రూపాయలు నగదు ను అందించడం చాలా సంతోషమని నారా లోకేష్ పుట్టినరోజు నాడు అంత మంచి పని చేస్తుంది దానికి నాగేశ్వరావుని అభినందించడం జరిగింది,యువగళం పాదయాత్రలో ప్రజల అందరితో మమేకమై ఆరోజు ప్రభుత్వ బాధ్యతగా ఉన్నటువంటి అనేక వర్గాల ప్రజలను కలిసి వారి యొక్క బాధలను తెలుసుకుంటూ కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకమైన పాత్ర వహించినటువంటి వ్యక్తి మంత్రి నారా లోకేష్ అన్నారు. యువగళం పాదయాత్రలో అనేక వర్గాలకు చేరువై మంగళగిరి నుంచి అత్యధికమైన మెజారిటీతో తెలుగుదేశం ఎప్పుడు గెలవని ప్రదేశం మంగళగిరి నుంచి అత్యధికమైన మెజారిటీతో గెలిచి అక్కడ ప్రజలు మన్ననలు పొందడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి యువగళం పాదయాత్ర ద్వారా చేసినటువంటి కృషి మనకు అందరికీ తెలిసిన అన్నారు.కేవలం పరిపాలనే కాకుండా పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం కూడా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి మంత్రి నారా లోకేష్ అన్నారు. కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి అండగా నిలబడుతూ వారికి అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు వారందరికీ బాధ్యతగా కార్యకర్తల సంక్షేమ మే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత స్వర్గీయ నందమూరి తారక రామారావు ఒక్కడిగా పార్టీ ప్రారంభిస్తే ఈరోజు కోటి మంది పైగా సభ్యత్వంతో తెలుగుదేశం పార్టీని పెద్ద కుటుంబం గా చేసినటువంటి వ్యక్తి మంత్రి నారా లోకేష్ అన్నారు. కోటి సభ్యత్వాలు నమోదు కావడంలో కీలకపాత్ర వహించిన వ్యక్తి ఎప్పుడూ లేని విధంగా డిజిటలైజేషన్ చేసి అదేవిధంగా ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ గాని కార్యకర్తల సంక్షేమానికి ఏ విధంగా కట్టుబడి ఉన్నదనే విషయం అలాగే కోటి సభ్యత్వాలు చేయడంలో లోకేష్ చేసినటువంటి కృషి కూడా మనం అందరం ఆయనను ఆ అభినందించాలని అన్నారు.తెలుగుదేశం పార్టీ ప్రతిష్టకు కార్యకర్తల సంక్షేమానికి నిరంతరము కృషి చేస్తున్న వ్యక్తి నారా లోకేష్ మనమందరం అభినందించాలని అన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు బాటలో అలాగే చంద్రబాబునాయుడు నాయకత్వంలో ఈరోజు తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తూ భవిష్యత్తు తరాలకు ఆశాకిరణంగా లోకేష్ అందిస్తున్నటువంటి వ్యక్తి ఆయన కష్టపడుతున్నటువంటి కష్టాన్ని ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారని నారా లోకేష్ భవిష్యత్తులో ఎన్నో పదవులు చేపట్టాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండి ఈ రాష్ట్రానికి సేవ చేసే విధంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.