వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత ఉపయోగంతో తక్కువ ఖర్చుతో, సమయం వృధాకాకుండా ఏవిదంగా చెయాలో రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా తణుకు మండలంలో దువ్వ గ్రామములో పొలం పిలుస్తుంది కార్యక్రమం శుక్రవారం నిర్వహించామని తణుకు మండల వ్యవసాయాధికారి కే.కుసుమ తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్రోన్ స్ప్రేయింగ్ గురించి రైతులకు వివరించడం జరిగింది. ఈ విధానం ఎలా ఉంటుందో రైతులకు తెలియజేయడానికి డ్రోన్ స్ప్రేయింగ్ వలన ఉపయోగాలు, వివరించి ముందుగా మద్దూరి లక్ష్మణ్ పొలములో 6 ఎకరాలలో డ్రోన్ ద్వారా పిచికారి విధానం చూపించారు. దీనివల్ల సమయం, ఖర్చు, శ్రమ తగ్గుతుందని 2.5-3 మీటర్ల దూరంలో మొక్కపై భాగము నుండి స్ప్రే చేసుకుంటే మంచిది. తుంపర్లు (బిందువులు) కూడా చాలా సూక్షముగా పడటం వల్ల మొక్క అంతటిని తక్కువ పురుగుమందుతో అనగా 70% కెమికల్ ఉంటే నీరు 30% వరకు మాత్రమే వాడి పురుగును, తెగులును పూర్తిగా అరికట్టవచ్చును. నానో యూరియా నానో డి.ఏ.పి.లను కూడా డ్రోన్ తో స్ప్రే చేయవచ్చును. రైతులు అందరు డ్రోన్ స్ప్రేయింగ్ కి అలవాటు చేసుకుంటే ఖర్చు తగ్గించుకుని తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించాలని మండల వ్యవసాయధికారిణి కె. కుసుమ రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.పి. రుద్ర ధనరాజు, చీర్ల రాధాకృష్ణ, సిరిగిశెట్టి వెంకటేశ్వరావు, మద్దూరి రాంబాబు గ్రామ వ్యవసాయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు.
