గేదెల దొంగతనం కేసులో దొంగలను పట్టుకుని రికవరీ చేయడం జరిగింది – సాయిబాబా రెడ్డి
దొంగతనం కేసులో మొత్తం సెటిల్మెంట్ తణుకు రూరల్ సీఐ ఆధ్వర్యంలో జరిగింది.
సెటిల్మెంట్ విషయం సోషల్ మీడియాలో కొన్ని పత్రికల్లో ప్రచారం అయింది.
సెటిల్మెంట్ లో కలెక్షన్ చేసిన మొత్తంలో సగభాగం మాత్రమే కోర్టు కు కట్టారు.
సెటిల్మెంట్ చేసి కలెక్షన్ చేసిన అధికారిని తప్పించి బిసి సామాజిక వర్గానికి చెందిన, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎస్ఐ ని, ఏఎస్ఐ ని, బాధ్యులను చేశారు.
చేయని తప్పుకి నేనెందుకు శిక్ష అనుభవించాలి అని వేదన చెందిన ఎస్సై మూర్తి
ఏ డిపార్ట్మెంట్లో బాధ్యతగా ఉద్యోగం నిర్వహించాలనుకున్నారో ఆ డిపార్ట్మెంట్ ఆయన్ని బలి తీసుకుందా?
దొంగతనంలో దొరికిన గేదెలను లేహం ఫ్యాక్టరీలో కటింగ్ కి వెళ్లిపోయాయి.
16 లక్షల రూపాయల గేదెలకు గాను 13 లక్షల రూపాయలు రికవరీ చేశారు.. కోర్టుకి రూ 6,50 లక్షలు కట్టారు.
మిగిలిన మొత్తం సి.ఐ. సమక్షంలో జరిగింది కాబట్టి వారే బాధ్యత వహించాలి కానీ అమాయకులపై ఎస్సీ, బీసీ సామాజిక వర్గ ఉద్యోగులపై నిందలు మోపి హింసించారు.