దేశ ప్రజల హక్కులను రక్షించే పాత్రను భారత రాజ్యాంగం పోషిస్తుందని అది ప్రజల జీవన విధానంలో భాగమని మాజీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ డా.కె.రాజ శిఖామణి స్పష్టం చేశారు. నగరంలోని బుల్లయ్య కాలేజీ రామా టాకీస్ రోడ్ లోని అంబేద్కర్ భవన్ లో శనివారం ఇంటర్నేషనల్ దళిత జర్నలిస్టుల నెట్వర్క్ (ఐడిజెఎన్) ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం- ఆవశ్యకత -పరిరక్షణ అంశంపై సదస్సును నిర్వహించారు.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం ప్రాతిపదికపై దేశ ప్రజలకు గొప్ప రాజ్యాంగాన్ని అందించిన ఘనత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కు దక్కిందన్నారు. కుల,మత, లింగ, ప్రాంతీయ సాంస్కృతిక అసమానతలను రాజ్యాంగ రూపుమాపిందని పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడటానికి మీడియా ప్రధాన పాత్ర పోషించాలన్నారు. ముఖ్యంగా మహిళలకు అన్ని హక్కులు కల్పించడం ద్వారా వారు అన్ని రంగాలలో ఎదిగాన్నారు.ఆంధ్రా యూనివర్సిటీ అంబేద్కర్ లా కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కోట పల్లవి మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో సామాజిక న్యాయం పిల్లర్ లాంటిదన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినంత మాత్రాన అది రాజ్యాంగ ఉల్లాంఘన క్రిందకు రాదన్నారు.భారత రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని మార్చే అధికారం చట్టసభలు,కోర్టులతో సహా ఎవరికీ లేదని చెప్పారు. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు,ఇతర ఇతర హక్కులు ప్రజలకు ఎంతో మేలు చేసేవిగా ఉన్నాయని వాటిని పూర్తి స్థాయిలో అమలు చేసుకోవడం ద్వారా మరింత అభివృద్ధి సాధించాలన్నారు. రాష్ట్ర పతి అవార్డు గ్రహీత ఇ. పి. ఎస్. అధ్యాపకురాలు ఇ.పి.ఎస్.భాగ్యలక్ష్మి మాట్లాడుతూ రాజ్యాంగ మౌలిక సూత్రాలన్నీ రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నాయని ప్రతి పాఠశాలలో ఆ చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం ద్వారా రాజ్యాంగ గొప్పతనాన్ని చెప్పాలన్నారు. బోధించు, సమీకరించి,పోరాడు నినాదాన్ని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మనకు అందించారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ విజ్ఞానానికి గుర్తుగా గౌరవించడం మనకు గర్వకారణం అన్నారు. ఐడీజేఎన్ రాష్ట్ర అధ్యక్షుడు తంగేటి నానాజీ (నాని )మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కుల వివక్ష కలిగిన 14 దేశాల్లో కుల నిర్ములనా అవగాహనతో పనిచేయడానికి జర్నలిస్టులతో ఐడిజెఎన్ ఏర్పడిందని తెలిపారు. జర్నలిస్టులో వృత్తిపరమైన అభివృద్ధి, ఆర్థిక స్థాయి పెంపుదల సాధించడంతోపాటు దళిత, బహుజన సామాజిక వర్గాలకు వృత్తిపరంగా సహకారం అందించడానికి సమస్త పని చేస్తుందని పేర్కొన్నారు.న్యూరో సైకియాట్రిస్ట్ డా. బి.రమేష్ బాబు మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో అంబేద్కర్ పాత్ర మహోన్నతమైందని ఆయన అందరివాడు అని కొనియాడారు. అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడు బొడ్డు కళ్యాణ రావు మాట్లాడుతూ ప్రభుత్వం పరిశ్రమలు, సంస్థలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చెబితే దానికి వ్యతిరేకంగా నేడు ప్రైవేటీ కరణం కొనసాగుతుందని ఇది రిజర్వేషన్లను పరోక్షంగా తొలగించతామేనాన్నారు. రాజ్యాధికారమే అన్ని సమస్యలకు పరిష్కారం అని దళిత బహుజనలంతా ఆ దిశగా పయనించాలని కోరారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. లోదర్ బాబు మాట్లాడుతూ అసమానతలు కలిగిన భారత దేశంలో అందరికీ సమాన అవకాశాలు, రిజర్వేషన్లు రాజ్యాంగం ద్వారా పొందామన్నారు. అన్ని రంగాల్లో ఇంత అభివృద్ధి సాధించిందంటే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగమే దానికి కారణమన్నారు. ఈ కార్యక్రమంలో మనభూమి దినపత్రిక ప్రచురించిన అంబేడ్కర్ -పూలే క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అతిథులకు అంబేద్కర్ చిత్రపటాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐడిజెఎన్ ప్రతినిధులు పి.సత్యనారాయణ, కె.చంద్రమోహన్, సైమన్, మధు, మురళి, వరద, శేషు, కోన ప్రకాష్, జాన్ వరబాబు తదితరులు పాల్గొన్నారు.
