స్కూలు ప్రారంభోత్సవంలో మాజీ ఎంపీ మురళీమోహన్ – తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
చదువులో విద్యార్థికి ప్రారంభ దశలో వేసిన పునాది భవిష్యత్తులో ప్రయోజనకరంగా మారుతుందని మాజీ ఎంపీ, ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. తణుకు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన టైనీ టాట్స్ కిండర్ డే కేర్ ప్రీస్కూల్ నూతన భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణతో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. చదువుతోపాటు విలువలు నేర్పేందుకు ప్రారంభ దశలోనే పునాది వేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ ఔన్నత్యాన్ని ఆయన కొనియాడారు. కేవలం ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన రాధాకృష్ణ విదేశాల్లో ఉద్యోగం, వ్యాపారాలు చేసుకుంటూ ఎంతో డబ్బు సంపాదించే వారని అయితే వాటిని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చారని గుర్తు చేశారు. అనంతరం ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ విద్యాసంస్థ రానున్న రోజుల్లో మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రముఖ సీనియర్ జర్నలిస్టు ప్రభు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్కూలు అధినేత సృజన, చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళ దేవి, తణుకు ఎంపీపీ రుద్రా ధనరాజు, ఉండ్రాజవరం ఎంపీపీ పాలాటి ఎల్లారీశ్వరి, మాజీ వార్డు కౌన్సిలర్ దూలం చిట్టిపాప తదితరులు పాల్గొన్నారు.