కళా, సాంస్కృతిక కార్యక్రమాలకు భరోసా.
సేవా కార్యక్రమాల్లో కొనసాగుతోన్న దాతృత్వం
విశాఖ నగర ప్రజలపై విజయ దుర్గాదేవి కరుణా కటాక్షాలు ఎప్పుడూ ఉంటాయని, నగరం భక్తి, సంస్కృతి పరంగా మరింత అభివృద్ధి చెందాలని ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డా. కంచర్ల అచ్యుతరావు ఆకాంక్షించారు. శనివారం శ్రీశ్రీశ్రీ విజయ గణపతి సమేత విజయ దుర్గాదేవి ఆలయం 23వ వార్షికోత్సవ మహోత్సవాలలో పాల్గొన్న ఆయన, ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విశాఖపట్నం “సిటీ ఆఫ్ డెస్టినీ” మాత్రమే కాకుండా భవిష్యత్తులో “సిటీ ఆఫ్ డివోషన్” గా మారాలని ఆకాంక్షించారు. విశాఖలో కళాకారులకు ప్రోత్సాహం అందించేందుకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని స్పష్టం చేసిన ఆయన, సినీ పరిశ్రమ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. యువత చెడు అలవాట్లు విడిచి సన్మార్గాన్ని అవలంబించేందుకు ఆధ్యాత్మికత ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మహోత్సవాల్లో భాగంగా నిర్వహించిన *”డాన్స్ బేబీ డాన్స్” కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించి, ప్రతిభ కనబరిచిన కళాకారులను సన్మానించారు. భవిష్యత్తులో మరిన్ని కళా, సాంస్కృతిక కార్యక్రమాలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
డా. కంచర్ల అచ్యుతరావు విశాఖ ప్రజల కోసం, కళాకారుల సంక్షేమానికి తన వంతు సహాయం చేస్తూనే ఉంటారని ఉపకార్ ట్రస్ట్ ప్రతినిధులు నాగు, సుధీర్, అరుణ పేర్కొన్నారు. భక్తుల సేవలో పాల్గొనడం తమకు గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు డా. కంచర్ల అచ్యుతరావు ఘనంగా సన్మానించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మహోత్సవ వేడుకలను భక్తిశ్రద్ధలతో ఆచరించారు. భక్తి, సాంస్కృతిక సేవా కార్యక్రమాలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని తెలియజేసిన డా. కంచర్ల అచ్యుతరావు, విశాఖ అభివృద్ధికి మరింత ముందుండి పనిచేస్తానని భరోసా ఇచ్చారు.