తణుకు పట్టణానికి చెందిన ప్రముఖ సామాజికవేత్త వి.ఆశాజ్యోతి ఉమన్ ఆఫ్ ఎక్స్లెన్స్ అవార్డు–2025, నారీరత్న అవార్డునకు ఎంపికయ్యారు. నిరంతరాయంగా సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రభంజనం సృష్టిస్తున్న శ్రీశ్రీ కళావేదిక, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 9న విజయవాడలో నిర్వహించనున్న అంతర్జాతీయ దినోత్సవంలో ఈ పురస్కారం అందుకోనున్నారు. ఈ సందర్భంగా ఆశాజ్యోతిని పలువురు అభినందించారు
