శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తణుకు యస్ యంవియం పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన హేలిఫ్యాడ్ నందు ఉదయం 9:00 గంటలకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనస్వాగతం పలికిన వారిలో జిల్లా ఇన్చార్చి, రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టరు నిమ్మల రామానాయుడు, రాష్ట్ర పురపాలక పరిపాలన మరియు పట్టణ అభివృద్ధి శాఖ మాత్యులు పొంగూరు నారాయణ, ఏపి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, జిల్లా పరిషత్తు చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ,పులపర్తి రామాంజనేయులు, పితాని. సత్యనారాయణ, బొల్లినేని శ్రీనివాస్,మద్దిపాటి వెంకటరాజు, బొమ్మిడి నాయకర్, శాసనమండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖరం, రాష్ట్ర ఏపిఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, మాజీ పార్లమెంటు సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, మాజీ శాసన మండలి సభ్యులు అంగర రామ్మోహన్, మాజీ శాసన సభ్యులు ముళ్ళపూడి వెంకటకృష్ణారావు, జిల్లా బిజెపి జిల్లా అధ్యక్షులు అయినంపూడి శ్రీదేవి, తదితరులు వున్నారు.
