జనసేన పార్టీ ఆవిర్భావ సభకు విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి సుమారు 3500 మంది శుక్రవారం బయలుదేరారు. హలో విశాఖ- చలో పిఠాపురం పేరుతో బయల్దేరిన వాహనాలను విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు, 33వవార్డు కార్పొరేటర్ వసంత లక్ష్మి జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ సుమారుగా 4000 మంది విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆదేశాలతో విశాఖ నుంచి పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు బయలుదేరినట్లు చెప్పారు. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిగా తరలిరానున్నారని తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్గ్రాభివృద్ధి ధ్యేయంగా పని చేస్తుందని అన్నారు. ఈ ప్రభుత్వం ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని వెల్లడించారు. ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం ముందడుగు వేస్తుందని పేర్కొన్నారు. జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అదేశాలతో పార్టీ క్యాడర్ అంతా సమన్వయం తో కలిసి పని చేస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శివ ప్రసాద్, నారానాగేశ్వర రావు, అంతోని శేఖర్, చంటి, రూప తదితరులు పాల్గొన్నారు.
