హైదరాబాదీ ఇరానీ పిస్తా హలీం సెంటర్ రుచి అదుర్స్…! – విశాఖపట్నం పోర్ట్ స్టేడియం దగ్గర్లో…!
రంజాన్ మాసం అనగానే ఆహార ప్రియులకు టక్కున గుర్తుకు వచ్చేది హలీమ్ అందరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇప్పుడు మన విశాఖపట్నం పోర్ట్ స్టేడియం దగ్గర్లో నవాజ్ మహమ్మద్ ఆధ్వర్యంలో హైదరాబాది ఇరానీ పిస్తా హలీం సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఈ స్టాల్ ని ప్రారంభించారు. విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ హలీమ్ అంటే నాకు చాలా ఇష్టం అని ఇప్పుడు విశాఖపట్నంలో నవాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది విశాఖ ప్రజలందరూ వచ్చి హలీమ్ ని టేస్టు చేయాలని విష్ణుకుమార్ రాజు కొనియాడారు. ఇక్కడ తిన్నటువంటి ప్రజలు అమోఘమైన రుచిగా ఉందని కొనియాడారు. ఇక్కడ ప్రత్యేకం ఏమిటంటే హైదరాబాద్ నుండి సెపరేట్ గా వంట మనుషులను తీసుకువచ్చి తయారు చేయబడుతుందని హలీమ్ సెంటర్ యాజమాన్యం నవాజ్ మహమ్మద్ కొనియాడారు. నిజానికి హలీమ్ మనది కాదు అరబిక్ వంటకం ముస్లింలు రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయంలో అల్పాహారంగా తీసుకుంటారు. మాంసం నెయ్యి, గోధుమలు, బియ్యం, మసాలాలు డ్రై ఫ్రూట్స్ వేసి ఇటుకలతో రూపొందించిన బట్టీలో గంటల తరబడి ఉడికించి దీన్ని తయారు చేస్తారు. పోషకాలు మెండుగా ఉండే ఈ వంటకం ఉపవాసంతో ఉన్నవారికి తక్షణ శక్తినిచ్చేలా పనిచేస్తుంది. ఈ రంజాన్ మాసంలో హలీం తినడం వల్ల ఉపవాసదీక్ష వల్ల కలిగే నీరసం నిస్సత్తువ దరి చేరని చెప్తారు. అయితే ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని మరింత ఆరోగ్యంగా చేస్తాయని ఆయన అన్నారు.