తణుకు పట్టణంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయము నందు తణుకు శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థి విద్యార్థుల ఫలితాలు వెలువడిన సందర్భంగా ఉత్తీర్ణులైన వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థుల ఫలితాలు రావడం జరిగిందని ముఖ్యంగా రాష్ట్రంలో ఇంటర్ మొదటి సంవత్సరం ఓవరాల్ గా 70 % ఇంటర్ రెండవ సంవత్సరం 80% గాను ఉత్తీర్ణత సాధించడం జరిగిందని ఈరోజు రాష్ట్రంలో ఫలితాలు సాధించినటువంటి విద్యార్థి, విద్యార్థినులకు శుభ అభివందనాలు తెలియజేస్తున్నానని అన్నారు. ముఖ్యంగా 10 సంవత్సరాల నుంచి రానటువంటి ఫలితాలు శాతం ఈరోజు ఎన్నడూ లేనటువంటి ఈ యొక్క ఉత్తీర్ణత శాతం కూటమి ప్రభుత్వం అందిస్తున్న పరిపాలనని అన్నారు, ముఖ్యంగా నారా చంద్రబాబునాయుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొని వచ్చినటువంటి విద్యావిధానాలలో సంస్కరణలు తర్వాత ప్రభుత్వ కాలేజీల్లో చదువుకునే విద్యార్థి విద్యార్థులు అలాగే కాలేజీ హాస్టల్ లో చదువుకునే విద్యార్థి విద్యార్థులు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో చదువుకుని విద్యార్థినులు, మంచి ఫలితాలు సాధించి ఈరోజు ఉత్తమ ప్రతిభను కనపరచడం జరిగిందని అలాగే ముఖ్యంగా మన తణుకులో గర్ల్స్ హాస్టల్లో చదువుకున్న విద్యార్థినులు ముఖ్యంగా పేద విద్యార్థినులు అందరు కూడా మంచి ఫలితాలు సంపాదించారని అన్నారు. ఇంటర్ ఫస్టియర్ గాని రెండవ సంవత్సరం గాని అందరూ కూడా మొత్తంగా పదిమంది ఏ గ్రేడ్లు సాధించిన ఘనత మన తణుకు విద్యార్థులు అని వారందరికీ కూడా పేరుపేరునా అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. ముఖ్యంగా చంద్రబాబునాయుడు ఎప్పుడూ కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న విద్య వ్యవస్థలను పటిష్టం చేసి అన్ని రకాలుగా కూడా సంస్కరణలో తీసుకొని వచ్చి ప్రతి విద్యార్థి విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్లే విధంగా ఈరోజు ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని అనుగుణంగా పనిచేస్తుందన్నారు. మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ మాత్యులుగా ఆయన వచ్చిన కాలము నుండి అనేక రిఫార్మ్స్ తీసుకొని వచ్చి ఈరోజు విద్యార్థి విద్యార్థులలో ఒక చైతన్యం తీసుకొని వచ్చిన వ్యక్తి నారా లోకేష్ అని అన్నారు. ఈరోజు ప్రభుత్వ కళాశాలలో చదువుకొనుచున్న విద్యార్థి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించే విధంగా ఆయన చేసే సూచనలు గాని రిఫార్మ్స్ గాని విద్యార్థి విద్యార్థులు అందరిలో కూడా ఒక ధైర్యాన్ని తీసుకొని వచ్చి వారిని ఉత్తములుగా తీర్చిదిద్దారని అన్నారు.అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లక్ష్యం ఒకటే పేద బడుగు బలహీన వర్గాలు విద్యార్థి విద్యార్థులు సమాజంలో గొప్పగా ఎదగాలనేదే చంద్రబాబునాయుడు ఆశయం అని దానికి అనుగుణంగా ఈరోజు ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలను తీసుకొని వచ్చి విద్యార్థి విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగేలాగా తోడ్పడుతున్నారని అన్నారు. ఈరోజు తణుకులో ఉన్నత ఫలితాలు సాధించినటువంటి విద్యార్థి విద్యార్థులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అని అన్నారు. ఈ ఫలితాలు రావడానికి కృషి చేసినటువంటి వార్డెన్ కి మరియు సిబ్బందికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. గతంలో ఎన్నడూ లేనటువంటి ఫలితాలు బాగా వచ్చాయని వారందరూ మరింత ప్రతిభను కనపరచడం చాలా సంతోషకరమని ఈరోజు ఎవరైతే ఇంటర్మీడియట్లో ఫలితాలు సాధించినవారు భవిష్యత్తులో ఉన్నత స్థానాన్ని ఎదగాలని అలాగే ఉన్నత స్థాయికి స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని వారందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్న అని అలాగే మన తణుకు నియోజకవర్గంలోని మన తణుకు పట్టణంలో విద్యార్థి విద్యార్థులు వారి యొక్క ప్రతిభను కనబరిచి 98.5 శాతం సాధించారని అలాగే 99% కూడా సాధించారని వారందరూ కూడా వారందరూ ఉత్తమ ప్రతిభను సాధించిన వారందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని ఈ సందర్భంగా మాట్లాడినారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ ఇరగవరం తెలుగుదేశం మండల అధ్యక్షులు గోపిశెట్టి రామకృష్ణ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు.
