ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం తేతలి గ్రామంలో నెంబర్ 2 స్కూలు యందు శనివారం ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో భాగంగా రమాబాయి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవసరమయ్యే నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్. ట్రస్ట్ వ్యవస్థాపకులు అరిగెల రాజేష్ మాట్లాడుతూ అంబేద్కర్ జీవితం, చదువు గురించి వివరించడంతో పాటు అంబేద్కర్ చేసిన గొప్పతనం గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జనతా హాస్పిటల్ డాక్టర్ డి. సత్యనారాయణ రాజు విచ్చేసి మాట్లాడుతూ అంబేద్కర్ జీవితం ఆయన పేదల జీవితాలలో వెలుగును నింపడానికి పడిన కష్టాలు వివరించారు. ఈ కార్యక్రమంలో తేతలి అంబేద్కర్ యూత్ ఏ.ఆర్.ట్రస్ట్ సభ్యులు, కేసరపల్లి వెంకట్రావు, కొటాల పల్లయ్య, సరెళ్ళ వీరతాత, సభ్యతి వరప్రసాద్, మద్దిల యేసు, బయ్యే రాజేష్, గారపాటి సురేష్, విప్పర్తి అజయ్, దాసరి నరేష్, దిడ్ల పండు, బయ్యే శ్యామ్, కొలుకుల రాము, కేసరిపల్లి చంద్ర, పాల్, గండి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
