మరింత కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదించిన మంత్రి దుర్గేష్
ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి దుర్గేష్
నేడు ఇంటర్మీడియట్ బోర్డ్ విడుదల చేసిన ఫలితాలలో స్టేట్ టాప్ ర్యాంక్ లను సాధించి విజేతలుగా నిలిచిన విద్యార్థులను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మాత్యులు కందుల దుర్గేష్ అభినందించారు. రాజమహేంద్రవరం లోని స్థానిక చెరుకూరి కళ్యాణ మండపంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తన అంధత్వాన్ని ఎదురించి హెచ్ఈసీ సోషల్ స్టడీస్ లో 955 /1000 మార్కులు సాధించిన షేక్ ఫర్జానా ను మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు. స్థానిక అల్కాట్ గార్డెన్స్ లోని డా. ఏపీజే అబ్దుల్ కలామ్ జూనియర్ డిగ్రీ కాలేజ్ కు చెందిన ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థులు కే. కళ్యాణి 461/470, కే. హర్షిత (461/470), పి. హర్షిత (461/470), రెండవ సంవత్సర చదువుతున్న ఝాన్సీ భారతి రెడ్డి (965/1000), సీ హెచ్ గోపినాథ్ (961/1000) ఎస్ కే ఫర్జానా (పీహెచ్ సీ బ్లైండ్)(955/1000), ఎస్. స్రవంతి (950/1000).పి. లోకేష్ 949/1000 లకు ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ ప్రశంసా పత్రాలను అందచేశారు. అనంతరం కార్యక్రమానికి
హాజరైన విద్యార్థులను సత్కరించి సర్టిఫికెట్స్ ను బహుకరించారు. ఈ సందర్భంగా విద్యార్థుల అత్యుత్తమ ఫలితాల సాధనలో కృషి చేసిన తల్లిదండ్రులను, అబ్దుల్ కలాం జూనియర్ కాలేజీ కరెస్పాండెంట్ శ్రీమతి సూర్య కుమారిని మంత్రి దుర్గేష్ అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించాలని మంత్రి ఆకాంక్షించారు. అదే విధంగా ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రంలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులందరికీ మంత్రి కందుల దుర్గేష్ శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా మంత్రి కందుల దుర్గేష్ ను కళాశాల యాజమాన్యం శాలువాతో సత్కరించి డా.అబ్దుల్ కలాం ఫోటోను బహుకరించారు..