ఘనంగా జరుగుతున్న జాతర మహోత్సవాలు – ఎమ్మెల్యే దంపతులకు వేదపండితుల ఆశీర్వచనాలు
తణుకు మండలం మండపాక గ్రామంలో వేంచేసిన శ్రీ చక్రరాజ సహిత శ్రీ యల్లారమ్మ అమ్మవారి వసంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మార్చి 30 నుంచి ఈనెల 13 వరకు జరిగే వసంతోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి జాతర మహోత్సవం అత్యంత వైభవగా సాగింది. ఈ సందర్భంగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, కృష్ణతులసి దంపతులు శనివారం యల్లారమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ కమిటీ సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు ఎమ్మెల్యే రాధాకృష్ణ దంపతులకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య వేద పండితులు ఎమ్మెల్యే దంపతులను ఆశీర్వదించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.