ప్రపంచ మేధావిగా అవతరించిన మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

హక్కుల కోసం నిరంతరం పోరాడిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం కృషి

తణుకు నియోజకవర్గంలో వాడవాడలా అంబేద్కర్ జయంతి వేడుకలు

జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

               *****

పేద కుటుంబంలో జన్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్వయంకృషితో ఉన్నత చదువులు చదివి భారతదేశ ప్రజాస్వామ్యానికి దిశ, దశ నిర్దేశించే స్థాయికి ఎదిగిన మహనీయుడని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని సోమవారం తణుకు నియోజకవర్గంలో వాడవాడలా జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. సందర్భంగా అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన అంబేద్కర్ దేశంలోని అన్ని వర్గాలకు సమానత్వం ఉండాలనే లక్ష్యంతో ఆలోచన చేశారని అన్నారు. భారత రాజ్యాంగాన్ని నిర్మించడమే కాకుండా దేశ ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలు, కులాలు, మతాల వారికి వారి వారి హక్కులు కల్పిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా రాజ్యాంగాన్ని రచించడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద మేధావిగా అనేక సంస్కరణలకు నాంది పలికిన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఒక కులానికి లేదా మతానికి చెందిన వ్యక్తి అంబేద్కర్ కాదని దేశంలో ప్రతి ఒక్కరికి స్ఫూర్తి నింపే శక్తిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నిండిచారని అన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తూ ప్రజా సంక్షేమం, అభివృద్ధిని అమలు చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన అంబేద్కర్విదేశీ విద్య నిధి పేరును పున ప్రారంభించడంతో పాటు అంబేద్కర్ ఆశయాలకనుగుణంగా ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. గత ప్రభుత్వం రద్దు చేసిన 29 ఎస్సీ సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం పునప్రారంభించిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దేశ ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో పేదరికం గెలిచే విధంగా ప్రతి కుటుంబంలో పారిశ్రామికవేత్తను తయారు చేసే విధంగా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని రాధాకృష్ణ వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో తణుకు నియోజవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link