మోడీ ప్రభుత్వం రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీస్తుంది.

పదేళ్లుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుందని. సిపిఎం వేల్పూరు గ్రామ కార్యదర్శి బళ్ళ చిన వీరభద్రరావు అన్నారు. భారత జాతి ముద్దుబిడ్డ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా వేల్పూరు. మరియు ఇరగవరం మండలం కావలిపురం గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వీరభద్రరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మతపరమైన విభజన కోసమే గో సంరక్షక దళాల పేరుతో మైనారిటీలు. దళితులపై దాడులు చేస్తూ మతతత్వాన్ని రెచ్చగొట్టి ప్రజలలో మతపరమైన విభజన తేవడానికి బిజెపి. తన మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నాయని వీరభద్రరావు పేర్కొన్నారు. అందులో భాగమే ఇటీవల మైనార్టీలకు సంబంధించిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు మంద బలంతో ఏకపక్షంగా ఆమోదించుకుని మైనారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంపై జరుగుతున్న దాడులను ఎదుర్కొని రాజ్యాంగ మౌలిక.లౌకిక స్వభావాన్ని సంరక్షించుకోవడంతో పాటుగా రాజ్యాంగ లక్ష్యాలను ముందుకు తీసుకు వెళ్లడమే డాక్టర్ అంబేద్కర్ కు మనం అర్పించే ఘన నివాళి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వాసా వెంకటేశ్వరరావు. అంబటి రామకృష్ణ. యండమూరి నాగేంద్ర. సోరపల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link