పశ్చిమగోదావరి జిల్లా మేదరి సంక్షేమ నూతన కార్యవర్గ ఎన్నిక, సర్వసభ్య సమావేశం ఆదివారం తణుకు ఎన్టీఆర్ పార్క్ ఎదురుగా ఉన్న షాదీ ఖానాలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ మేదరి మహేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల అధికారి కొండా భాను శ్రీనివాస్ పర్యవేక్షణలో ఎన్నికలు జరిగాయి. జిల్లా అధ్యక్షుడుగా ఆకివీడు కు చెందిన సందా కేశవరావు, ప్రధాన కార్యదర్శిగా తణుకు కు చెందిన ధూళిపాళ్ల ముసలయ్య, కోశాధికారిగా కొండా ఉదయ బాలాజీ భీమవరం, ప్రచార కార్యదర్శి గా కాపెల్లి వెంకటేశ్వర రావు అత్తిలి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తణుకు మేదరి సంక్షేమ సంఘం సభ్యులు ఎన్నికైన సభ్యులను ఘనంగా సత్కరించారు. జిల్లా నలుమూలల నుండి మేదరి సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తణుకు మేదరి సంఘ అధ్యక్షుడు వెంకటేశ్వరావు, జోరిగే చిన్న, అత్తిలి సంఘ అధ్యక్షుడు కొండా భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
