నిడదవోలు నియోజకవర్గంలో 8650 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.. వియత్నాం పర్యటనలో ఉన్న మంత్రి దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గంలో ఉన్న 56 గ్రామాల్లో ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని ఆదివారం అధికారులను ఆదేశించారు. త్వరలోనే నియోజకవర్గంలో మరిన్ని టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.. ధాన్యం కొనుగోలు లక్ష్యం పెంచమని అడిగిన వెంటనే స్పందించి చర్యలు చేపట్టిన మంత్రి కందుల దుర్గేష్ పని తీరుపై నియోజకవర్గ రైతాంగం సంతోషం వ్యక్తం చేసింది.
