భారతమాత ఆటో యూనియన్ స్టాండ్ తణుకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవల సంస్థ వారి ఉత్తర్వులు మేరకు లేబర్ డే వారోత్సవాలలో బాగంగా సోమవారం ఆటో యూనియన్ స్టాండ్ తణుకు వారికి న్యాయ విజ్ఞానసదస్సు నిర్వహించి, ప్రతి ఒక్కరూ వాహనాలకు సంబంధించి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని, వాహనములు నడుపునపుడు జాగ్రత్తగా ఉండాలని, సెల్ ఫోన్ మాట్లాడుతూ, ఓవర్ లోడ్ ఎక్కించుకోవడం, నేరమని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, ఆటో వర్కర్లకు ఈ-శ్రం పోర్టల్ ద్వారా వారి పేర్లు నమోదు చేసుకోవాలని, దానివల్ల ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి కే. కృష్ణసత్యలత పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూరంపూడి కామేష్, సీనియర్ న్యాయవాదులు కౌర్ వెంకటేశ్వర్లు, పొట్ల సురేష్, లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు ఎం. కిరణ్ కుమార్, బి. లక్ష్మణ్ కుమార్, సి.డి.పి.ఓ ప్రమోదినికుమారి, పారా లీగల్ వాలంటీర్ లు కే. నాగమల్లీశ్వరి, ఎం. శ్రీదేవి, శ్రీ కొనపల్లి అరుణ్ బాబు, కే. నరసన్న, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ పి. రాంబాబు, విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
