అల్లూరి సీతారామరాజు జీవితం యువతకు విద్యార్థులకి ఆదర్శవంతం కావాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏ ఐ యస్ ఏ) జిల్లా కార్యదర్శి టి. అప్పలస్వామి పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం తణుకులో స్థానిక MCS డిగ్రీ కళాశాలలో అల్లూరి సీతారామరాజు 101 వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఏ ఐ యస్ ఏ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి టి. అప్పలస్వామి మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జీవితం యువతకు విద్యార్థులకు ఆదర్శం కావాలని వారు పిలుపునిచ్చారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులను గడగడలాడిచ్చిన విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు అని, అల్లూరి జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యయనమని సాయుధపోరాటం ద్వారానే స్వాతంత్ర్యం వస్తుందని నమ్మి దానికోసం తమ ప్రాణాలను అర్పించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని వారు తెలిపారు. 1924 మే 7 న చింతపల్లి అడవులలో కొయ్యూరు గ్రామంలో బ్రిటిష్ వారు సీతారామరాజును బంధించి ఒక చెట్టుకి కట్టి కాల్పుల ద్వారా ఉరి తీసారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డి వెంకటేష్, కే. గంగాధర్ , సిహెచ్. కరుణాకర్ , వై. సత్యసాయి, పి. హర్ష తదితరులు పాల్గొన్నారు
