ప్రముఖ వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యులు జయంతి సందర్భంగా వీవర్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, టిడిపి నాయకురాలు వావిలాల సరళాదేవి ఆధ్వర్యంలో తణుకు రాష్ట్రపతి రోడ్డున వున్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ఎదురుగా ఉన్న అన్నమాచార్యల విగ్రహానికి పూలమాలలు ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగులో మొట్టమొదటి వాగ్గేయకారుడు అన్నమయ్య అని 35 వేల కీర్తనలు రచించి పాడిన గొప్ప కీర్తనాచార్యులని, గొప్ప సంఘసంస్కర్త, కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరునిపై పాడిన పాటల ద్వారా ఆయనను దర్శించి ఆయనకి తాను రచించిన పాటలు అన్నీ అంకితం చేసిన గొప్ప భక్తిపరుడు అన్నమాచార్యుల అని అన్నారు. ఈ సందర్భంగా ప్రమీలారాణి పాల్గొన్ని అన్నమయ్య కీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో కె.శ్యామల, ఎమ్ జ్యోతి, కె.గంగ, నూలి లక్ష్మి భజన బృందం పాల్గొన్నారు.
