వైశాఖ బుద్ధపౌర్ణమి సందర్భంగా ఉండ్రాజవరంలో నిర్వహించిన అన్నదానకార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు ఎమ్మెల్సీ సోము వీరాజు. ఈ సందర్భంగా బౌద్ధ పీఠం స్వామీజీ బంతే అనాలియా ఆయనతో బౌద్ధక్షేత్రంలో ప్రత్యేక పూజలు, ప్రార్ధన చేయించారు. ఈ సందర్భంగా సోము వీరాజు అనంతరం మాట్లాడుతూ బుద్ధుని బోధనలు మానవాలి అనుసరించి శాంతి, ప్రేమతో జీవనం సాగించాలన్నారు. నూతనంగా నిర్మిస్తున్న బౌద్ధ దేవాలయాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పిక్కి నాగేంద్ర, నిడదవోలు నియోజకవర్గం కన్వీనర్ బండి సత్యనారాయణ, ఉండ్రాజవరం మండలం బిజెపి పార్టీ ప్రెసిడెంట్ కొప్పినీడి సత్యనారాయణ, రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ బూరుగుపల్లి వెంకటేశ్వరరావు, అక్కిన గోపాలకృష్ణ, బూరుగుపల్లి శివరామకృష్ణ, కొయ్యల ఈశ్వరిభవాని, బూరుగుపల్లి షర్మిల పెరవలి మండల పార్టీ ప్రెసిడెంట్ బల్ల లీలా కృష్ణ, గంగాధర్ , కొవ్వూరు నియోజకవర్గం నాయకులు, నిడదవోలు నియోజకవర్గ నాయకులు బిజేపి నాయకులు పాల్గొన్నారు.
