మండల కేంద్రమైన ఉండ్రాజవరంలో శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ గోకర్ణేశ్వర స్వామి ఆలయంలో కోరినకొర్కెలు నెరవేర్చే తల్లి శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారికి వైశాఖ మాసం పౌర్ణమి సందర్భంగా సోమవారం తెల్లవారుజామున శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారికి పంచామృతాలతో వివిధ పళ్ళరసాలతో అభిషేకం సహస్ర నామ కుంకుమార్చనలు జరిగాయి. అనంతరం మహిళా బక్తులు లలితాపారాయణ గావించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రతీ పౌర్ణమికీ విశేష అలంకారములతో పాటు ప్రత్యేకపూజలు చేస్తామని అర్చకులు మద్దిరాల వెంకటరమణ తెలిపారు.
