కూటమి ప్రభుత్వం వివిధ కార్పోరేషన్ చైర్మన్ల భర్తీలో నిడదవోలు నియోజకవర్గానికి చెందిన బూరుగుపల్లి శేషారావును ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా అమరావతి సెక్రటేరియట్లో “APSSD” చైర్మన్ గా నియమించిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ని కలిసి ధన్యవాదములు తెలిపిన నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు, ఇంఛార్జి బూరుగుపల్లి శేషారావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న యువతలో నైపుణ్యాన్ని పెంచే విధంగా తాను శక్తివంచన లేకుండా పనిచేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమితులైన నిడదవోలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు వెల్లడించారు.
