రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకర్రావు అరెస్టు బాధాకరమని రాష్ట్ర బి.సి.మహిళా గౌరవ అధ్యక్షురాలు, వీవర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి అన్నారు. ఈ సందర్భంగా తణుకులో ఏర్పాటుచేసిన పత్రికా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మనదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ బిసి కులగణన చేపడతామని తెలపడం చాలా సంతోషమని అన్నారు. ఈ సందర్భంగా దేశ మంత్రి నరేంద్రమోడీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి దేశ, రాష్ట్ర కులగణలపై చర్యలు త్వరితగతిన చేపట్టాలని, అదేవిధంగా మహిళా రిజర్వేషన్ దామాషా ప్రకారం రిజర్వేషన్ లు అమలుచేయాలని కొరారు.
అదే విధంగా నిరంతరం బిసిలకోసం పోరాడుతూ డిల్లీ నుంచి గల్లీ వరకు బిసి రిజర్వేషన్ పై గాని, మహిళా రిజర్వేషన్ లపై గాని నిరంతరం పొరాడే వ్యక్తి రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకర్రావు, ఇటివల కాలంలో విజయవాడలో ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ వుండగా పోలిసులు అరెస్టు చేయటం చాలా బాధాకరం అన్నారు. ఈ సంఘటన పై ప్రతి బి.సి. ఆవేదన వ్యక్తంచేశారని, రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం మహిళా గౌరవ అధ్యక్షురాలిగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కూటమి ప్రభుత్వానికి విజ్ణప్తి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బి.సి.మహిళా నాయకులు పాల్గొన్నారు.
