గత నెల 22 వ తేదీన జమ్మూ కాశ్మీర్ లోని పహల్గం లో జరిగిన ఉగ్రదాడి తర్వాత, ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో నిన్న భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు, దానిపై బిజెపి రాష్ట్ర నాయకురాలు డా. ముళ్ళపూడి రేణుక గారు పూర్తి వివరణాత్మకoగా పత్రికలు ద్వారా ప్రజలకు వివరించారు. ఇంతకు ముందు ప్రధానిలు జాతి ఉద్దేశించి మాట్లాడిన ప్రసంగాలు కన్నా మోదీ ప్రసంగం చరిత్రలో నిలిచిపోయేలా ఉంది, ఈ ప్రసంగం యావత్ జాతి కి ధైర్యాన్ని, ఉత్తేజాన్ని, విశ్వాసాన్ని పెంచింది, అందరిని కలిపేలా ఉంది, ఈ ప్రసంగంలో ఎక్కడా రాజకీయాలు మాట్లాడకుండా, జాతీయ విధానాలు పై జాతీయ సమస్యలు పై, దేశ సమర్ధత గురించి, శక్తి సామర్ధ్యాలు గురించి ఒక్క పాకిస్తాన్ కే కాకుండా ప్రపంచానికి తెలిసింది, ఈ ప్రసంగం యావత్ జాతికి సంతోషాన్ని కలిగించింది, ఈ సందర్భంగా మోడీ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు, ఆపరేషన్ సింధూర్ తో పాకిస్థాన్ ఒక సంకేతం పంపించాము, ఇక నుండి ఈ దేశంలో ఎక్కడ ఉగ్ర దాడి జరిగిన అది యుద్ధం గా భావిస్తాము, ఒక్క తూటా ఇటు వైపు వస్తే, ఇటు నుండి అటు వైపు మిస్సైల్ వెళుతుంది, పహల్గామ్ సంఘటన తర్వాత మనం దేశం నుండి గట్టిగా దాడి చేసామో, 100 కిలో మీటర్లు లోపలికి వెళ్ళి మన సైన్యం అక్కడ ఉగ్రవాదులు స్థావరాలు ను కుప్పకూల్చామో, వాళ్ళ ఎయిర్ స్ట్రిప్స్ నేల కూల్చామో, భవిష్యత్ లో కూడా గట్టి ప్రతిఘటన ఉంటుంది అని చెప్పారు. మోడీ గారి మాటలు ఈ దేశానికి పూర్తి ధైర్యాన్ని ఇచ్చింది,.
ఉగ్రవాదం- వాణిజ్యం;
ఉగ్రవాదం చర్చలు ఒకేసారి జరగవు.
వాణిజ్యం, చర్చలు కావాలని అనుకుంటే ఉగ్రవాదం ఆపండి, అలాగే నీరు, రక్తం ఒకేసారి పారవు,
నీళ్లు కావాలనుకుంటే ఉగ్రవాదం రూపంలో రక్తపాతాన్ని ఆపాలి, ఏది కావాలో తేల్చుకోండి అని మాట్లాడరు.
నీరు, వాణిజ్యం ఉగ్రవాదం కావాలని అనుకుంటే చర్చలు ఉండవు, ప్రతిఘటనే ఉంటుంది.
పాకిస్థాన్ తో చర్చలు అంటూ జరిగితే రెండు విషయాలు పై తప్ప మిగతా దేని మీద చర్చలు ఉండవు అన్నారు,
చర్చలలో రెండే అంశాలు:
పీవోకే (పాక్ ఆక్రమిత కాశ్మీర్)
ఉగ్రవాదం (ఉగ్రవాదులును భారత్ కి అప్పగించాలి)
భారత్ పాకిస్థాన్ మధ్య మధ్యవర్తిత్వం ఎవరు అవసరం లేదు అని గట్టిగా చెప్పారు, ఈ వ్యాఖ్యలు అమెరికా మరియు కొన్ని దేశాలు మధ్యవర్తిత్వం చేయాలను కొనే వారికి ఒక సందేశం ఇచ్చారు.
అదే విధంగా పాకిస్థాన్ కి మూడు రోజులలోనే మన శక్తి ఏమిటో చూపించాము, భవిష్యత్ లో న్యూక్లియర్ వెపన్స్ వాడతాము అని బెదిరింపు ధోరణి కి పాకిస్థాన్ కి అవకాశం లేకుండా చేసాము.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్, బి యస్ యాఫ్ కి నేను సెల్యూట్ చేస్తున్నాను అని చెప్పటంలో దేశ ప్రజలు గర్వంగా ఫిల్ అవ్వలవలిసిన సందర్భం, ఆపరేషన్ సింధూర్ అనే దానికి కామా మాత్రమే ఫుల్ స్టాప్ లేదు, ఎప్పుడైతే పాకిస్థాన్ ఉగ్రవాద కవ్వింపు చర్యలు మానేస్తుందో అప్పుడే ఆపరేషన్ సింధూర్ కి పూల్ స్టాప్ ఉంటుంది. అని చెప్పటం తో ప్రపంచ దేశాలకు మోడీ గారు భారత్ ఒక శక్తి వంతమైన దేశమని సంకేతాలు పంపించడం జరిగినది.