తణుకు నియోజకవర్గం తణుకు మండలం కోనాల గ్రామంలో తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో తణుకు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రజల సమస్యలు పరిష్కారానికి సత్వర చర్యలు, సమస్యల నుంచి విముక్తి చేసేందుకు గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ గ్రామంలో 2100, మంది జనాభా కలిగి ఉన్నారని ఈ గ్రామ ప్రధాన సమస్యలు డ్రైన్లు, రోడ్లు అద్వానంగా ఉన్నాయని అన్నారు. ఈ గ్రామంలో ఇవన్నీ కూడా ఒక ప్రణాళి ప్రకారం డ్రైనేజీలు, రోడ్లు 100% పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామన్నారు.కోనాల గ్రామంలో ఉపాధి పనుల నిమిత్తం గత ప్రభుత్వం వారానికి రెండు రోజులు పని కల్పిస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారానికి ఆరు రోజులు పని కల్పించే ఘనత ఈ కూటమిదన్నారు. తణుకు మండలం ఎన్ ఆర్ జి ఎస్ ఉపాధి పథకం నిధులు 5 కోట్ల రూపాయలు పనులు చేపడుతుంటే ఇప్పుడు 10 కోట్ల రూపాయలు పెంచి ఒక ఎస్టిమేషన్ తయారు చేస్తామని అన్నారు. గ్రామాల్లో ముఖ్యంగా సంక్షేమ పథకాల్లో భాగంగా పెన్షన్లు కొరత ఎక్కువగా ఉందని
గత ప్రభుత్వం పెన్షన్లు పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని అన్నారు. గత ప్రభుత్వం వచ్చిన కానుంచి కొత్త పెన్షన్ అమలు చేయలేదని ఇప్పుడు ఈ కూటమ ప్రభుత్వం రానున్న రోజుల్లో నూతన పెన్షన్ మంజూరు చేసే విధంగా ముందుకు వెళుతుందని అన్నారు. గ్రామాల్లో ప్రజల ఇంటి నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారంతో నాలుగు లక్షల రూపాయలు మంజూరు చేస్తుందని అన్నారు. కోనాల గ్రామంలో పంచాయతీ ఆదాయం నిధులు ఉన్నాయని వాటిని పెంచే విధంగాచర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఇంటింటికి మంచినీటి కులాయిని అందజేస్తామని తెలిపారు.అనంతరం గ్రామంలోని ఎంపీపీ స్కూల్, మరియు అంగన్వాడి స్కూల్ ని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి స్కూల్స్ కు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడినారు, కోణాల గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీల నాయకులు, ప్రభుత్వ సిబ్బంది, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
