సమాజాన్ని, పాఠశాలను, కుటుంబాన్ని గౌరవించాలి. తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు ప్రత్యేక పోలీసు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే.పద్మావతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తణుకు టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ కే. శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడిరి. విద్యార్థులు, తల్లిదండ్రులను, పాఠశాల టీచర్లను గౌరవిస్తూ సమాజంలో మంచి సత్ప్రవర్తనను కలిగి ఉండాలని కోరారు. విద్యార్థులలో క్రమశిక్షణాలోపం, హెయిర్ స్టైల్స్, చెడు అలవాట్లుకు బానిసలై జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని పిలుపునిచ్చారు. విద్యార్థులు క్రమశిక్షణ చర్యలకు గురైతే వారిజీవితంలో అది మచ్చగా మిగిలిపోతుందని, విద్యార్థులకు పోలీసులు స్నేహితులుగా ఉంటారు, కానీ చెడు ప్రవర్తన కలిగిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించిరి. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మల్లిన రాధాకృష్ణ, స్టాఫ్ సెక్రటరీ జి.జే.ప్రభువరం, ఉపాధ్యాయులు, ఉపాధ్యేయేతర సిబ్బంది పాల్గొన్నారు.
