స్వాతంత్ర సమరయోధుడు యువకిశోరం సర్దార్ భగత్ సింగ్ నేటి యువతకు స్ఫూర్తి అని ఉదయగోదావరి జిల్లాల శాసనమండలి సభ్యులు బి. గోపి మూర్తి కొనియాడారు. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో మినీ బైపాస్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సర్దార్ భగత్ సింగ్ విగ్రహాన్ని ఉభయగోదావరి జిల్లాల శాసనమండలి సభ్యులు బి. గోపి మూర్తి ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జెండా స్థూపాన్ని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బళ్ళ చిన వీరభద్రరావు అధ్యక్షతన జరిగిన సభలో గోపిమూర్తి మాట్లాడుతూ దేశం కోసం దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై పోరాడి ఊరి కంభం ఎక్కిన యువకిశోరం భగత్ సింగ్ గొప్ప దేశభక్తుడని ఆయన కొనియాడారు. భగత్ సింగ్ కలలు కన్నా సార్వభౌమాధికారం. లౌకికతత్వం, సోషల్ కోసం పోరాడుతున్న నేటితరానికి గొప్ప మార్గదర్శకుడని అన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జక్క శెట్టి సత్యనారాయణ. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కామన మునిస్వామి మాట్లాడుతూ. సామ్రాజ్యవాదానికి. పెట్టుబడిదారీ వ్యవస్థకు, సమాజానికి కులమత తత్వాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాలకు భగత్ సింగ్ చూపిన పోరాట పటిమతో నేడు కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ దేశాన్ని రక్షించుకోవలసిన బాధ్యత మన అందరికీ ఉన్నదని, అందుకు భగత్ సింగ్ త్యాగాన్ని స్ఫూర్తిని స్మరించుకుని వారి ఆశయ సాధనకోసం పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ విగ్రహం తయారుచేసిన శిల్పి అందే మల్లేష్ ను గోపి మూర్తి సాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాసా వెంకటేశ్వరరావు, కర్ణాటపు నరసింహారావు, వనచర్ల ప్రమీల, బళ్ళ నాగలక్ష్మి, తిరునాదం వెంకటేశ్వరరావు, సోరపల్లి రామకృష్ణ, తాళ్ల సత్యనారాయణ, విశ్వనాథం సుబ్బారావు, కుడకా వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.
